Ys Jagan Sankshema, A Nightmare For
YS Jagan : తెలుగు దేశం పార్టీ నాయకులు పొద్దున లేస్తే కేంద్రంతో జగన్ లాలూచి పడ్డాడు.. ఆయన రాష్ట్రం యొక్క ప్రయోజనాలను పనంగా పెట్టాడు అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కేంద్రం వద్ద నోరు విప్పి మాట్లడక పోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అంటూ గతంలో ఎన్నో సార్లు కేంద్రం కు మరియు జగన్ కు సంబంధం ఉంది అంటూ తెలుగు తమ్ముళ్లు మరియు అధినేత చంద్రబాబు నాయుడు చినబాబు లోకేష్ బాబు కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ విషయమై మైరింత స్పష్టత వచ్చినట్లు అయ్యిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితులు మరియు వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్దం అయిన సమయంలో సీబీఐ వారు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. సీబీఐ వారు జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించవద్దు అంటూ కోర్టు లో పిటీషన్ వేయడం జరిగింది. దాంతో కోర్టు జగన్ విదేశీ పర్యటనకు నో చెబుతూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తో జగన్ కి ఎలాంటి రిలేషన్ ఉందో చెప్పకనే చెబుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వైకాపా నాయకులు ఈ విషయమై ప్రధానంగా చర్చించుకుంటున్నారు. జగన్ మరియు మోడీల మద్య సన్నిహిత సంబంధాలు ఉంటే..
YS Jagan mohan reddy and pm narendra modi not friends
ఒక వేళ మోడీకి అన్ని విధాలుగా జగన్ సహకరిస్తున్నాడు అనుకుంటే అక్కడ నుండి కూడా జగన్ కు సహకారం అందాలి కదా అంటూ వైకాపా వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఆధీనంలో ఉండే సీబీఐ ని జగన్ కు వ్యతిరేకంగా కోర్టు లో పిటీషన్ వేయకుండా మోడీ లేదా కేంద్ర ప్రభుత్వంలోని ఎవరో ఒకరు ఆపేవారు. కాని జగన్ కు మోడీతో కేంద్రం తో టీడీపీ వాళ్లు అనుకుంటున్నంత సఖ్యత లేదు అని దీంతో తేలిపోయింది. జగన్ మోహన్ రెడ్డి తన కూతురు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి పట్టా తీసుకుంటున్న నేపథ్యంలో పారిస్ కు వెళ్లి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అని భావించాడు. కాని పరిస్థితి చూస్తే అది వర్కౌట్ అయ్యేలా లేదు.
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
This website uses cookies.