Categories: NewspoliticsTelangana

YS Sharmila : షర్మిల ట్వీట్లపై దుమారం.. ట్వీట్ చేసి అడ్డంగా బుక్కయిపోయిన షర్మిలక్క?

Advertisement
Published by
Advertisement

YS Sharmila : మనం ఒకరిని వేలెత్తి చూపించేముందు.. మన చేతికి ఉన్న మిగితా నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయి. అంటే.. ఒకరిని అనే ముందు మనం సరిగ్గా ఉన్నామా? అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం సరిగ్గా లేకుండా… నిజాయితీగా లేకుండా.. రూల్స్ ఫాలో కాకుండా.. వేరే వాళ్లను విమర్శించే హక్కే లేదు. తాజాగా వైఎస్ షర్మిల చేసిన పని కూడా అదే. తను కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలోనే ఖమ్మంలో సంకల్ప సభ నిర్వహించారు. ఆ సభ వల్ల చాలా కరోనా కేసులు పెరిగాయి. కనీసం కరోనా జాగ్రత్తలు కూడా పాటించలేదంటూ సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగ దీక్షను చేపట్టారు. ఆ సమయంలోనూ ఎవ్వరూ మాస్కులు ధరించలేదు. కరోనా జాగ్రత్తలేవీ పాటించకుండా… గుంపులు గుంపులుగా దగ్గర దగ్గర కూర్చున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నసమయంలో కూడా కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా… వైఎస్ షర్మిల దీక్ష అంటూ, పాదయాత్ర అంటూ హైదరాబాద్ లో చాలా అలజడి సృష్టించారు.

Advertisement

trs leaders on ys sharmila tweet on municipal elections

కట్ చేస్తే… వైఎస్ షర్మిల ఇటీవల కొన్ని ట్వీట్లు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మాత్రం నలుగురితో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే గ్లాస్ షీల్డ్ ను ఉపయోగించి కోవిడ్ నిబంధలను పాటిస్తూ రక్షణ చర్యలను తీసుకుంటున్నారు. లక్షల మంది పాల్గొనే ఎన్నికల్లో మనం ఈ నిబంధనలు ఎంతవరకు పాటించగలం. కాబట్టి ఈ నెల నిర్వహించే అన్ని ఎన్నికలను వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరుతున్నాం. కోవిడ్ ఉధృత రూపం దాల్చుతున్న ఈ తరుణంలో ప్రజల ప్రాణాలకు విలువనిచ్చి మీ నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాం… అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

Advertisement

YS Sharmila : వైఎస్ షర్మిల ట్వీట్ పై టీఆర్ఎస్ నేతల ఫైర్?

ప్రజల ప్రాణాల గురించి మీరు మాట్లాడుతున్నారా షర్మిల? మీరు బహిరంగ సభలు నిర్వహించి.. వేల మందిని పిలిచినప్పుడు మీకు కరోనా గుర్తుకు రాలేదా? కరోనా ఉధృతంగా ఉన్నా కూడా పోలీసులు వద్దని చెప్పినా వినకుండా… ఖమ్మంలో బహిరంగ సభ పెట్టి కరోనా వ్యాప్తికి కారణమయ్యారు? అప్పుడు మీకు ఈ ప్రజలు గుర్తుకు రాలేదా? మీ సభకు రావడం వల్ల ఎంతమంది కరోనా బారిన పడ్డారో మీకు తెలియదా? అంటూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వైఎస్ షర్మిలను నిలదీస్తున్నారు.

కరోనా నిబంధనలు పాటించి ఉంటే.. షర్మిల ప్రధాన అనుచరుడు… బాలకృష్ణారెడ్డి కరోనాతో చనిపోయి ఉండేవారే కాదు… అంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. షర్మిల ఖమ్మం సభలోనూ కరోనా జాగ్రత్తలు పాటించలేదు.. మాస్క్ కూడా ధరించలేదు. చివరకు ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగ దీక్షలోనూ, పాదయాత్ర సమయంలోనూ, లోటస్ పాండ్ వద్ద కూడా కనీసం మాస్క్ పెట్టుకోలేదు.. అంటూ తెలంగాణ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇటువంటి ట్వీట్ చేసి… అడ్డంగా బుక్కయిపోయారు.

Advertisement

Recent Posts

Gold Rates Today 16 February 2026: పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..!

Gold Rates Today 16 February 2026: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. గత…

49 minutes ago

Brahmamudi 2026 February 16th Episode: బ్రహ్మముడి 2026 ఫిబ్రవరి 16 ఎపిసోడ్: “వాళ్లను చంపేయండి” – రుద్రాణి ఆర్డర్.. ఇంటి నుంచి వెళ్లిపోయిన రాజ్, కావ్య!

Brahmamudi 2026 February 16th Episode: బ్రహ్మముడి 2026 ఫిబ్రవరి 16 ఎపిసోడ్: స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్…

1 hour ago

Drinks to Boost Immune System : రోగనిరోధక శక్తిని పెంచే 5 అద్భుతమైన పానీయాలు – ఇవి తాగితే ఏ రోగం మీ దరిచేరదు!

Drinks to Boost Immune System : మారుతున్న వాతావరణం, కాలుష్యం, వైరస్‌ల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే బలమైన…

2 hours ago

Tea Hydration : టీ తాగితే డీహైడ్రేషన్ అవుతుందా? శరీరంలో నీటి శాతం తగ్గుతుందా?

Tea hydration : చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే పని ఒత్తిడి తగ్గించుకోవడానికి…

3 hours ago

India vs Pakistan T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్ 2026 దాయాదిపై దండయాత్ర.. పాక్‌పై 61 పరుగుల తేడాతో భారత్ జయభేరి

India vs Pakistan T20 World Cup 2026 : కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా Team…

12 hours ago

Keesaragutta : కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు..!

Keesaragutta : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి…

12 hours ago