YSRCP : అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల గడువు ఉండగానే అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్ కార్యకర్తలను మరియు పార్టీ నాయకులను సన్నద్దం చేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాలని ముందు నుండే వైయస్ జగన్ కసరత్తులు చేస్తున్నారు. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే మెజార్టీ సీట్లను ఈసారి సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం ఏపీ జనాలకు అందించింది.
ఆ విషయాన్ని కార్యకర్తలు జనాల్లోకి తీసుకు వెళ్లగలిగితే ఖచ్చితంగా మరో సారి విజయం అధికార పార్టీ వైకాపాకు దక్కడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జగన్ పార్టీకి నష్టం జరిగింది. తెలుగుదేశం పార్టీకి అక్కడ మంచి సీట్లు దక్కించుకుంది. కనుక ఈసారి అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఇప్పటి నుండి కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు అయిన విశాఖ జిల్లాలో ఆకె అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఆ ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు తెలుగు దేశం గత ఎన్నికల్లో గెలుచుకుంది.వాటిని ఇప్పుడు గెలుచుకునేందుకు జగన్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
విశాఖను రాజధానిగా ప్రకటించడం వల్ల ఇప్పటికే జగన్ పట్ల అక్కడి వారిలో అనుకూల పరిస్థితి ఉంది. మేయర్ ఎన్నికల్లో అది క్లియర్ గా కనిపించింది. కనుక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తో పాటు చుట్టు పక్కల నియోజక వర్గాలు కూడా వైకాపా గెలుచుకునే అవకాశం ఉందని అంతా నమ్మకంతో ఉన్నారు. విశాఖపట్నం కోరుకున్నట్లుగా.. ప్రజలు కోరుకున్నట్లుగా.. రాజధానిని తీసుకొచ్చిన నేపథ్యంలో జగన్ కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడతారని వైకాపా నాయకులు నమ్మకంతో ఉన్నారు. అంతే కాకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు విశాఖకు మంచి చేకూరుస్తున్నాయి. కనుక విశాఖపట్నం మరియు చుట్టు పక్కల ప్రాంతాల అన్నింటిలో కూడా వైకాపా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.