YS Jagan : ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైకాపా ముఖ్య నాయకులు ఆ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని ఈ విషయం పై స్పందిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ఉన్న వారు మాత్రమే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని.. మా నాయకుడికి అలాంటి భయాలు లేవని, ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల పూర్తి అధికారం ముగిసిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళతామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముందస్తు ఎన్నికల ఫలితాలు ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న అభిప్రాయంను మార్చలేవని.. ఫలితాన్ని తారు మారు చేయలేవని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మరో రెండు సంవత్సరాలకు ఎన్నికలు జరిగినా అది జగన్ కి ప్రయోజనమే అనేది వైకాపా నాయకులు మాట. గత మూడు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి.ప్రజలు ఆ విషయాన్ని గమనించి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్ ను మళ్లీ సిఎంగా చేస్తారని వైకాపా నాయకులు ధీమాతో ఉన్నారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రజల నిర్ణయాన్ని పక్కకు పెట్టడం అవుతుందని.. వారు ఇచ్చిన ఐదు సంవత్సరాల అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న తర్వాత మాత్రమే సాధారణ ఎన్నికలకు వెళ్దాం అంటూ జగన్ ఇటీవల పార్టీ నాయకులు తెలియజేశారని సమాచారం అందుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేంత భయం కానీ.. అభద్రతా భావం కానీ జగన్ కి లేదు. వైకాపా నాయకులు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్దం అన్నట్లుగా వారు తెలియజేస్తున్నారు. కనుక షెడ్యూల్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.