YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మనసులో ఏదైనా అనుకుంటే దాన్ని బయట పెడితే విమర్శలు వస్తాయేమో అని కూడా ఆలోచించకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ వెళ్తాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా 10వ మరియు ఇంటర్ తరగతుల పరీక్షలు క్యాన్సిల్ చేసి ప్రమోట్ చేశారు. కాని ఏపీలో మాత్రం ఆ పరీక్షలు జరిపి తీరుతామని అంటున్నారు. విద్యార్థులు చాలా నష్టపోతారని, వారి సర్టిఫికెట్ లు జీవితాంతం పనికి రాకుండా పోకూడదు అనే ఉద్దేశ్యంతో తాను ఈ పని చేస్తున్నట్లుగా జగన్ బలంగా చెప్పుకొచ్చడు. కరోనా కేసులు ఎన్ని ఉన్నా జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చాడు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజన్ చాలా క్లీయర్ గా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో కూడా ఆయన చెబుతున్న లెక్కలు నిజమే అనిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా రేపటి నుండి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మే 15 వరకు వ్యాక్సిన్ తీసుకునేందుకు గాను యువత పెద్ద ఎత్తున రిజిస్ట్రర్ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు వెంటనే ఇంత మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు డోసులు సిద్దంగా లేవు. మన దేశంలో నెలకు ఏడు నుండి ఎనిమిది కోట్ల డోసులు తయారు అవుతున్నాయి. 18 నుండి 45 ఏళ్ల లోపు వారు దేశంలో దాదాపుగా 60 కోట్ల మంది ఉన్నారు. వారు అందరికి కూడా వ్యాక్సిన్ అందాలి అంటే చాలా సమయం పడుతుంది. అందుకే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో సెప్టెంబర్ నుండి వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచిస్తున్నాడు.
ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్ల వ్యాక్సిన్ లు ఉత్పత్తి అవుతాయని అంచనా. అయినా కూడా దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో అందరికి వ్యాక్సిన్ అంటే గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబడుతున్నాడు. వ్యాక్సిన్ అందరికి ఒకేసారి ఇవ్వడం అనేది సాధ్యం కాదు కనుక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ ఇవ్వాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. కాని ఇప్పటికే వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి. కనుక వ్యాక్సినేషన్ డోసులు ఎలా ఉత్పత్తి చేస్తారనేది చూడాలి.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.