Ys Jagan vs chandrababu
Ys Jagan vs chandrababu ఏపీలో తాజా ఘటనలతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న వేళ సీఎం జగన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉన్న నేపధ్యంలో అన్ని దారులను మూసేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసిపి నేతలు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో భారీగా చంద్రబాబు ఇంటి ప్రధాన ద్వారం బయట ఆందోళనకు దిగారు. దీంతో టిడిపి నేతలకు వైసీపీ నేతలకు మధ్య బాహాబాహి చోటుచేసుకుంది.
ఇక ఈ ఘటనపై తెలుగు తమ్ముళ్లు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. రాజకీయ విమర్శలు తట్టుకోలేకపోతే ఇళ్ళ మీద దాడులకు దిగుతారా అంటూ ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం ఉంటుందో, ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం ఉంటుందని వైసిపి నేతలను హెచ్చరించారు. తాడేపల్లిలో జగన్ కొంప నుండి చంద్రబాబు నివాసానికి, చంద్రబాబు నివాసం నుండి జగన్ కొంపకు అంతే దూరం ఉంటుందని చెబుతున్నారు.
Ys Jagan vs chandrababu
తాము కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేయగలమని, దాడులకు దిగగలమని, కాకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు సంయమనం పాటించండి అని చెప్పడంతో సైలెంట్ గా ఉన్నామని ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తే బాగుంటుందని హెచ్చరించారు. బాబు ఇంటి పై వైసిపి గుండాలు దాడి చేశారని ఆరోపిస్తున్న తెలుగు తమ్ముళ్లు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబుకి రక్షణ లేకుండా పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Ys jagan
సీఎం జగన్ నివాసం వైపు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసివేసి, ఎలాంటి ఆందోళన చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు. సీఎం జగన్ నివాసం వైపు వెళ్ళే అన్ని మార్గాలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు ఇక ట్రాఫిక్ ను జాతీయ రహదారిపైకి మళ్లించారు. టిడిపి కార్యకర్తలు జగన్ నివాసం వద్ద ఆందోళనలకు దిగే అవకాశం ఉందని ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను చేపట్టిన పోలీసులు వైఎస్ జగన్ ఇంటి వైపు వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి, అడుగడుగునా నిఘా పెట్టారు.
మరోవైపు ఈ క్రమంలో పోలీస్ అధికారులపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఈ మేరకు ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ద్వారకా తిరుమలరావు ప్రకటనను విడుదల చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎస్పీ నా కొడుకులు అని సంభోదించడం ఆక్షేపణీయం. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు హుందాతనంతో, విలువలతో, స్థాయికి తగ్గట్టు వ్యవహరించాల్సిన అవసరం ఎంతయినా ఉందంటూ పేర్కొన్నారు.
Chandrababu
ఎన్నో సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్న తమ పట్ల అనుచితంగా వ్యవహరించడం ఎంత వరకు సబబు. ఒక పోలీసు ఉన్నతాధికారిని దూషించడమంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనునిత్యం శ్రమిస్తున్న పోలీసు వ్యవస్థను తూలనాడడంలో ఔచిత్యం ఏమిటో ఆలోచించుకోవాలి. ఇష్టానుసారం మాట్లాడి వ్యవస్థలను అభాసుపాలు చేయొద్దు. పరిధిని అతిక్రమించి మాట్లాడొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నామని తిరుమలరావు పేర్కొన్నారు. మరి ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందోనన్నదే ఆసక్తికరంగా మారింది.
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.