KCR : వైఎస్సార్ గురించి ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది అంటారా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. తెలుగు ప్రజలు అందరూ కలిసే ఉండాలని.. రెండు రాష్ట్రాలుగా తెలుగు ప్రజలు విడిపోకూడదని.. ఆయన బతికి ఉన్నసమయంలో చాలాసార్లు స్పష్టం చేశారు. అలాగే.. తెలంగాణ వస్తే ఏమౌతుందో కూడా ఆయన 2009 లోనే చెప్పారు. తెలంగాణ వస్తే.. ఏపీ ప్రజలు పరిస్థితి ఏమౌతుందో కూడా ఆయన ఆనాడే ఊహించగలిగారు. ఇప్పుడు అది నిజం అయింది. దాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు.. అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే.. ప్రస్తుత కరోనా కాలంలో ఏపీలో సరైన సౌకర్యాలు లేక.. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్న హైదరాబాద్ కు ఏపీ ప్రజలు తరలివస్తుంటే.. మధ్యలో తెలంగాణ సరిహద్దు వద్ద.. ఏపీకి చెందిన కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పాస్ లేకుంటే.. తెలంగాణలో అడుగుపెట్టకూడదని.. ఈపాస్ ఉన్నవాళ్లకే తెలంగాణలోకి ఎంట్రీ అని స్పష్టం చేశారు. ఓవైపు కరోనా వచ్చి అల్లాడుతుంటే.. ఈ పాస్ లు పర్మిషన్లు గట్రా ఎక్కడి నుంచి తీసుకొచ్చేదని ఏపీకి చెందిన కరోనా పేషెంట్లు మొత్తుకున్నా.. తెలంగాణ పోలీసులు వినలేదు. దీంతో తెలంగాణ సరిహద్దు వద్దే.. ఏపీకి చెందిన కొందరు కరోనా పేషెంట్లు వైద్యం అందక.. అంబులెన్స్ లోనే మృతి చెందారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రజలు తిట్టిపోశారు. ఆ తర్వాత.. తెలంగాణ హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అవ్వడంతో వెంటనే ఏపీ అంబులెన్స్ లను తెలంగాణలోకి అనుమతించడం ప్రారంభించారు. ఏది ఏమైనా.. ఆ మూడు నాలుగు రోజులు.. ఏపీ ప్రజలు.. సరిహద్దు వద్ద ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు.
అయితే.. 2009 లో వైఎస్సార్.. కర్నూలులో ఎన్నికల ప్రచారంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రస్థావన తీసుకొచ్చి.. ఏపీ ప్రజలు తెలంగాణ వెళ్లాలంటే.. తెలంగాణ ప్రభుత్వం.. పాస్ పోర్ట్ అడిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.. అని ఆయన అప్పుడే ఊహించి అన్నారు. అది ఇప్పుడు నిజం అయింది. తెలంగాణకే కాదు.. ఏపీకి కూడా హైదరాబాద్ మరో మూడేళ్ల పాటు రాజధాని అనే విషయం కూడా మరిచిపోయి.. తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ ప్రజలను సరిహద్దు వద్దే ఆపేయడం తెలంగాణ ప్రభుత్వం అహంకారానికి నిదర్శనం అని ఏపీ ప్రజలతో పాటు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో నినదిస్తున్నాయి.
ఆనాడు వైఎస్సార్ చేసిన వ్యాఖ్యలను నేడు.. సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారు అని అంటున్నారు. ఓవైపు కరోనాతో ప్రజలంతా అతలాకుతలం అవుతుంటే.. మీకు పర్మిషన్లు కావాలా? హైదరాబాద్ కు వైద్యం కోసం పోవడానికి కూడా ఇన్ని నిబంధనలా? ఇదేం న్యాయం. ఇదేం ప్రభుత్వం.. ఏపీ ప్రజలను కావాలని ఇన్ని ఇబ్బందులకు కేసీఆర్ ప్రభుత్వం గురిచేసిందని.. ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోకి అనుమతిస్తుంటే.. ఒక్క తెలంగాణ మాత్రం ఏపీ ప్రజలపై చిన్న చూపు చూసిందని అంటున్నారు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.