ys sharmila gives clarity on her new party in telangana
ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పార్టీ పెట్టాక.. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు ఆయన చెల్లెలు షర్మిల. తర్వాత ఏమైందో కానీ.. తను పార్టీ కార్యక్రమాల్లో కనిపించడమే మానేశారు. ఏదో ఫ్యామిలీ విషయాల్లో మాత్రమే కనిపిస్తున్నారు కానీ.. వైసీపీ పార్టీ విషయాల్లో షర్మిల జోక్యం చేసుకోవడం లేదు. ఆ తర్వాత 2019 లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.. అంతా ఫుల్లు బిజీ అయిపోయారు. షర్మిలను కూడా మరిచిపోయారు.
ys sharmila gives clarity on her new party in telangana
కానీ.. తాజాగా వైఎస్ షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యారు. ఇన్నిరోజులు అసలు మీడియా ముందుకు రాలేదు.. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. అసలు పార్టీ గురించే పట్టించుకోవడం లేదు.. పోనీ తన అన్న ముఖ్యమంత్రి అయ్యాకనన్నా ఏమైనా జోక్యం చేసుకుంటున్నారా? అంటే అదీ లేదు. అయినా కూడా ఇంత సడెన్ గా ఎందుకు మళ్లీ షర్మిల చర్చనీయాంశం అయ్యారు అంతే దానికి కారణం ఒకే ఒక విషయం. అది… వైఎస్ షర్మిల తెలంగాణలో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు అనేది.
నిజానికి చాలా రోజుల నుంచి ఆ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. తాజాగా.. ఓ పత్రికలో ఆ వార్తను ప్రచురితం చేశారు. తెలంగాణలో జగన్ చెల్లెలు షర్మిల ఓ పార్టీ పెట్టబోతున్నారంటూ ఆ పత్రిక కథనాన్ని వడ్డించింది. ఆ కథనం చివరకు షర్మిల దగ్గరకు వెళ్లడంతో వెంటనే ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు షర్మిల.
ఈ ఆదివారం రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్ గా వచ్చిన ఒక కథనం నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్సార్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పత్రిక అయినా.. ఏ చానెల్ అయినా ఒక కుటుంబానికి చెందిన విషయాలను రాయటమే తప్పు. అది నీతిమాలిన చర్య. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్ ల మీద న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని తెలియజేస్తున్నాను.. అంటూ ఆమె పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…
Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…
Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…
Telangana : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…
LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…
Curry Leaves : ఈ ఆకులని ప్రతి ఒక్కరు కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. ఇది లేనిదే వంట కూడా చేయరు.…
This website uses cookies.