ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పార్టీ పెట్టాక.. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు ఆయన చెల్లెలు షర్మిల. తర్వాత ఏమైందో కానీ.. తను పార్టీ కార్యక్రమాల్లో కనిపించడమే మానేశారు. ఏదో ఫ్యామిలీ విషయాల్లో మాత్రమే కనిపిస్తున్నారు కానీ.. వైసీపీ పార్టీ విషయాల్లో షర్మిల జోక్యం చేసుకోవడం లేదు. ఆ తర్వాత 2019 లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.. అంతా ఫుల్లు బిజీ అయిపోయారు. షర్మిలను కూడా మరిచిపోయారు.
కానీ.. తాజాగా వైఎస్ షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యారు. ఇన్నిరోజులు అసలు మీడియా ముందుకు రాలేదు.. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. అసలు పార్టీ గురించే పట్టించుకోవడం లేదు.. పోనీ తన అన్న ముఖ్యమంత్రి అయ్యాకనన్నా ఏమైనా జోక్యం చేసుకుంటున్నారా? అంటే అదీ లేదు. అయినా కూడా ఇంత సడెన్ గా ఎందుకు మళ్లీ షర్మిల చర్చనీయాంశం అయ్యారు అంతే దానికి కారణం ఒకే ఒక విషయం. అది… వైఎస్ షర్మిల తెలంగాణలో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు అనేది.
నిజానికి చాలా రోజుల నుంచి ఆ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. తాజాగా.. ఓ పత్రికలో ఆ వార్తను ప్రచురితం చేశారు. తెలంగాణలో జగన్ చెల్లెలు షర్మిల ఓ పార్టీ పెట్టబోతున్నారంటూ ఆ పత్రిక కథనాన్ని వడ్డించింది. ఆ కథనం చివరకు షర్మిల దగ్గరకు వెళ్లడంతో వెంటనే ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు షర్మిల.
ఈ ఆదివారం రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్ గా వచ్చిన ఒక కథనం నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్సార్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పత్రిక అయినా.. ఏ చానెల్ అయినా ఒక కుటుంబానికి చెందిన విషయాలను రాయటమే తప్పు. అది నీతిమాలిన చర్య. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్ ల మీద న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని తెలియజేస్తున్నాను.. అంటూ ఆమె పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.