YS Sharmila: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దం అయ్యింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఖాయం అయ్యింది. ఇప్పటికే ఆమె అధికారికంగా ప్రకటించింది. ఖమ్మంలో బాగా బలం ఉన్న కారణంగా ఆమె దృష్టి మొత్తం అక్కడే ఉంది. వచ్చే ఎన్నికల్లో పూర్తి ఫోకస్ ఖమ్మం పైనే ఉంటుందని కూడా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినా కూడా ఖమ్మంలో ఆమె పోటీ చేయడంతో పాటు అత్యంత సన్నిహితులను మరియు బలమైన నాయకులను ఖమ్మంలో పోటీ చేయించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల పార్టీ ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పలేం కాని ఖమ్మంలో మాత్రం ఖచ్చితంగా తీవ్ర ప్రభావం ఉంటుందని ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది.
షర్మిల ఖమ్మంలో పాగా వేయడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైఎస్ కు ఖమ్మంలో ఉన్నంత అభిమానులు ఇతర జిల్లాల్లో లేరు అనేది తెల్సిందే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖమ్మంలో వైకాపా సాధించిన సీట్ల గురించి అందరికి తెల్సిందే. అక్కడి వారికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే ప్రత్యేకమైన అభిమానంగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే షర్మిల ఖమ్మం నుండి పోటీ చేయాలని భావిస్తుంది. అలాగే ఖమ్మంలో తన రాజకీయ జెండా ఎగురవేయాలని ఆశ పడుతుంది. మొదట ఖమ్మంలో పాగా వేస్తే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించవచ్చు అనేది ఆమె అభిప్రాయం.
ఖమ్మంలో వైకాపా ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అందుకే ఆమె ఖమ్మం అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతుంది. ఖమ్మం జిల్లాను మంత్రి పువ్వాడ అభివృద్ది పథంలో తీసుకు వెళ్తున్నాడు. అయినా కూడా అక్కడి జనాలు షర్మిల వైపు చూస్తున్నారు అనేది ఒక సర్వే ఫలితం. మెజార్టీ స్థానాలను ఖచ్చితంగా షర్మిల పార్టీ ఖమ్మంలో గెలుచుకుంటుంది. ఇతర జిల్లాల్లో ఖాతా తెరవకున్నా ఖమ్మంలో మాత్రం ప్రభావం చూపించడం పక్కా అంటూ స్వయంగా షర్మిల వర్గీయులు కూడా అంటున్నారు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.