Ys Jagan : కూటమి కి బిగ్ షాక్.. జగన్ ని కలవనున్న సుబ్రమణ్యస్వామి..?
ప్రధానాంశాలు:
Ys Jagan : జగన్ ని కలవనున్న సుబ్రమణ్యస్వామి ! కూటమి కి బిగ్ షాక్..!
Ys Jagan : తిరుమల లడ్డూ Thirupathi Laddu వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ విచారణ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చడంతో, ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన ఆరోపణలు కాస్తా తిరగబడ్డాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ కేవలం ఉద్యోగుల క్రమశిక్షణ మీద మాత్రమే విచారణ చేయాలని, ఇది సిబిఐ విచారణను ఏమాత్రం ప్రభావితం చేయకూడదని కోర్టు స్పష్టం చేయడంతో కూటమి ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్లయింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న సుబ్రమణ్యస్వామి Subramanian Swamy , త్వరలోనే జగన్ ని కలిసి ఈ విషయంపై లోతుగా చర్చించబోతున్నారనే వార్త ఇప్పుడు రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.
Ys Jagan : కూటమి కి బిగ్ షాక్.. జగన్ ని కలవనున్న సుబ్రమణ్యస్వామి..?
నిజానికి తిరుమల వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కానీ సిబిఐ ఛార్జ్ షీట్ చూస్తే ఎక్కడా జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని, కేవలం నాణ్యత లోపాలు మాత్రమే ఉన్నాయని తేలింది. దీనివల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక రకమైన ఊరట లభించింది. సుబ్రమణ్యస్వామి మొదటి నుండి ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. దేవాలయాల పవిత్రతను రాజకీయాల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదని ఆయన వాదిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కూడా ప్రభుత్వానికి పరిమితులు విధించడంతో, ఆయన జగన్ ని కలిసి ఈ న్యాయపోరాటాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇది కచ్చితంగా కూటమి ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
జగన్ తో సుబ్రమణ్యస్వామి భేటీ జరిగితే, అది కేవలం లడ్డూ వ్యవహారం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర అంశాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రభుత్వం నియమించిన దినేష్ కుమార్ కమిషన్ కు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని కోర్టు పరోక్షంగా చెప్పేసింది. అంటే కేవలం ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడానికే ఈ కమిషన్ పనికొస్తుంది తప్ప, గత ప్రభుత్వ పెద్దలను ఇరికించడానికి ఇది ఉపయోగపడదు. ఈ పాయింట్ నే సుబ్రమణ్యస్వామి ప్రధాన అస్త్రంగా మార్చుకోబోతున్నారు. లడ్డూ మీద జరిగిన తప్పుడు ప్రచారం వల్ల తిరుమల ప్రతిష్ట ఎంత దెబ్బతిన్నదనే విషయాన్ని ఆయన జగన్ తో చర్చించనున్నారట. ఈ భేటీ తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు మరిన్ని కౌంటర్లు వచ్చే ఛాన్స్ ఉంది.
రాజకీయంగా చూస్తే, జగన్ కి సుబ్రమణ్యస్వామి లాంటి వ్యక్తి మద్దతు దొరకడం ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి. దేశ రాజధానిలో మంచి పట్టున్న స్వామి, ఈ కేసును సుప్రీంకోర్టులో ఎంత బలంగా వినిపించారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సిబిఐ నివేదిక కూడా అనుకూలంగా రావడంతో, కూటమి సర్కార్ డిఫెన్స్ లో పడిపోయింది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో కానీ, జగన్ మరియు సుబ్రమణ్యస్వామి కలయిక మాత్రం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించడం ఖాయం. ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఈ కేసులో న్యాయపరంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద విజయం దక్కినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ భేటీని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా గమనిస్తోంది.