YSRCP : మేయర్ అభ్యర్థి ఎంపిక‌పై వైసీపీ సరికొత్త ప్లాన్…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YSRCP : మేయర్ అభ్యర్థి ఎంపిక‌పై వైసీపీ సరికొత్త ప్లాన్…!

YSRCP పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తుది ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్ జగన్ సారధ్యంలోని అధికార వైసీపీ మరోసారి ఏలూరును కైవసం చేసుకుంది. కోర్టు వివాదాల నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగా ఓట్ల లెక్కింపు జరగ్గా, విపక్ష టీడీపీ TDP కేవలం 3 సీట్లకు పరిమితమైంది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన-బీజేపీ కూటమికి ఒక్క సీటూ దక్కలేదు. ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లున్నాయి. అందులో మూడు సీట్లను ఎన్నికలను […]

 Authored By sukanya | The Telugu News | Updated on :26 July 2021,7:00 pm

YSRCP పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తుది ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్ జగన్ సారధ్యంలోని అధికార వైసీపీ మరోసారి ఏలూరును కైవసం చేసుకుంది. కోర్టు వివాదాల నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగా ఓట్ల లెక్కింపు జరగ్గా, విపక్ష టీడీపీ TDP కేవలం 3 సీట్లకు పరిమితమైంది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన-బీజేపీ కూటమికి ఒక్క సీటూ దక్కలేదు. ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లున్నాయి.

అందులో మూడు సీట్లను ఎన్నికలను ముందే వైసీపీ  YSRCPఏకగ్రీవంగా గెలుచుకోగా, ఇవాళ 47 స్థానాలకు కౌంటింగ్ జరిగింది. తుది ఫలితాలు కలిపి, వైసీపీ YSRCP మొత్తం 47 డివిజన్లను గెలుచుకోగా, టీడీపీ TDP కేవలం 3 డివిజన్లలోనే సత్తా చాటుకుంది. సీఎం జగన్ చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు జై కొట్టారని వైసీపీ నేతలు చెప్పారు. ఏలూరు కార్పొరేషన్ లో వైసీపీ గెలుపు ఊహించిందే అయినప్పటికీ, టీడీపీ అంతో ఇంతో పోటీ ఇస్తుందని, గుంటూరు, విశాఖపట్నం మాదిరిగా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ చివరికి 3 సీట్లతోనే టీడీపీ సరిపెట్టుకుంది. 28, 37, 47వ డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.

Ysrcp

Ysrcp

మేయర్ అభ్యర్థిపై రచ్చ.. Ysrcp 

రిజర్వేషన్ ప్రకారం ఏలూరు మేయర్‌ పదవిని ఈసారి జనరల్‌ మహిళకు కేటాయించారు. వైసీపీ YSRCP తన మేయర్‌ అభ్యర్థిగా మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పేరును ఖరారు చేసింది. 50 డివిజన్ నుంచి నూర్జహాన్ బేగం విజయం సాధించారు. ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యతతో ఆమె గెలుపొందారు. కౌంటింగ్ పూర్తి కాకుండానే ఏలూరు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ను కైవ‌సం చేసుకున్న వైసీపీ.. మేయ‌ర్ అభ్య‌ర్థిపై క‌స‌ర‌త్తును ప్రారంభించింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సొంతూరైన ఏలూరులో మేయ‌ర్ ప‌ద‌వి కోసం చాలా మందే కాసుక్కూర్చున్నారు.

YS Jagan

YS Jagan

వారిలో ఎవ‌రికి ప‌ద‌వి ఇచ్చినా.. మిగిలిన వారు అలిగి కూర్చునే అవ‌కాశాలున్నాయి. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా, ఏ ఒక్క చోట కూడా క‌నిపించ‌ని విధంగా ఇక్క‌డ ఏకంగా ఐదుగురికి మేయ‌ర్ ప‌ద‌విని ఇవ్వ‌నున్నామని అప్పుడెప్పుడో ఆళ్ల నాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంటే.. ఐదేళ్ల కాల ప‌రిమితి క‌లిగిన మేయ‌ర్ ప‌ద‌విని ఐదుగురికి పంచాలంటే.. ఏడాదికో మేయ‌ర్ మారాల్సిందేన‌న్న మాట‌. ఎంపికైన వారు ఏడాది తిరక్కుండానే ప‌ద‌విని అంత ఈజీగా ఎలా వ‌దులుతారోన‌న్న విష‌యాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది