2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధిని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడు. నిజానికి ఏపీ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి ఉన్న కానీ వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని ప్రజా సంక్షేమం కోసమే జగన్ ఖర్చుపెడుతున్నాడు. దీని వెనుక మరో బలమైన కోణం ఉన్నట్లు తెలుస్తుంది. అదే 2024 ఎన్నికలు
2015 లో ఒక మోస్తరుగా గెలుపు రుచి చుసిన జగన్, 2019 కి వచ్చేసరికి ఎవరు ఊహించలేని విజయాన్ని నమోదు చేశాడు. దానికి ప్రధాన కారణం పాదయాత్ర అని అందరికి తెలుసు, సీఎం జగన్ కూడా దానినే నమ్ముతున్నాడు. అయితే 2024 కి వచ్చేసరికి తన పాలన ద్వారానే మరోసారి విజయం సాధించాలని బలంగా భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సృష్టంగా తెలుస్తుంది.
2019 లో టీడీపీని చావుదెబ్బ కొట్టిన జగన్, 2024 లో మరోసారి అంతకంటే గట్టి దెబ్బ కొట్టాలని రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ 23 చోట్ల జెండా ఎగరవేసింది. అయితే ఈసారి వాటిలో కూడా వైసీపీ జెండా ఎగరాలని జగన్ మోహన్ రెడ్డి భావించి అందుకు తగ్గట్లు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట డైరెక్ట్ గా నిధులు వాళ్ళకి ఇవ్వకుండా, అక్కడి వైసీపీ ఇంచార్జి కి ఎక్కువ పవర్స్ ఇచ్చి, స్థానికంగా అతను పట్టు పెంచుకునేలా చేయటం. దాని ద్వారా వైసీపీ మీద సానుభూతి, అభిమానం పెరిగేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
మనం పైన చెప్పుకున్నట్లు ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్న 23 నియోకజవర్గాలను వైసీపీ టార్గెట్ చేసింది. అదే సమయంలో టీడీపీ కంచుకోట లాంటి జిల్లాల్లో మరింత పట్టు పెంచుకోవటానికి సిద్ధం అవుతుంది. ముఖ్యంగా అనంతపురం, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాలో వైసీపీని బలోపేతం చేయటానికి జగన్ సర్వ శక్తులు ఒడ్డుతున్నట్లు సమాచారం. ఇంకా ఎన్నికలకు రెండు మూడేళ్లు సమయం ఉన్నకాని ఇప్పటి నుండే కార్యాచరణ మొదలెట్టి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న జగన్ కు అవి ఎంత వరకు కలిసివస్తాయి అనేది చూడాలి
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.