Chandrababu : మూడున్నరేళ్ల తర్వాత అసెంబ్లీకి చంద్రబాబు.. అందరి దృష్టి పవన్పైనే..!
Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అసెంబ్లీ జరగబోతుంది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన 175 మందీ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ వారితో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు. పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో అందరికంటే సీనియర్ అయిన శాసన సభ్యుడిని ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేయడం ఆనవాయితీ.సీఎం చంద్రబాబునాయుడు సరిగ్గా మూడున్నరేళ్ల తర్వాత ఏపీ అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 2021 నవంబర్ 19న నిండు సభలో సవాలు చేసి సభ నుంచి నిష్క్రమించిన చంద్రబాబు ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి శాసన సభలోకి అడుగుపెట్టబోతున్నారు.
అసెంబ్లీలో ప్రత్యర్థులు చేసిన రాజకీయ విమర్శలతో కలత చెంది సభను విడిచిపెట్టారు. శాసనసభలో వ్యక్తిగత దూషణలు, హేళనలు, వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యులపై నిందలు, విమర్శలతో నలిగిపోయిన చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేశారు.శాసనసభను కౌరవ సభగా మార్చేశారని, మళ్లీ గౌరవ సభలోనే అడుగుపెడతానని నాడు సభలో సవాలు చేశారు.శాసనసభలో టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని మాట్లాడే వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వడానికి ప్రాధాన్యమిచ్చేవారు. ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే వ్యక్తిగత విమర్శలతో దాడి చేసేవారు. ఈ క్రమంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడును అధికార పార్టీ నేతలు అవమానించడంతో మనస్తాపం చెందిన చంద్రబాబు సభలో అడుగుపెట్టనని సవాలు చేశారు.
Chandrababu : మూడున్నరేళ్ల తర్వాత అసెంబ్లీకి చంద్రబాబు.. అందరి దృష్టి పవన్పైనే..!
నేడు సిఎం హోదాలో గౌరవంగా శాసనసభలో నారా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టనున్నారు. మళ్లీ సిఎంగానే సభకు వస్తాను అని 2021 నవంబర్ 19న సభలో శపథం చేసిన చంద్రబాబు అన్న ప్రకారమే మూడేళ్లుగా సభకు దూరంగా ఉన్నారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్.. ఈ సభలో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. వారిద్దరూ కూడా తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో నారా లోకేష్ శాసనమండలికి నామినేట్ అయ్యారు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.