AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వాడవేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ కూటమి గా ఏర్పడి ముందుకు సాగుతుంటే వైయస్ఆర్సీపీ ఒంటరి పోరాటం చేస్తుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రముఖ సంస్థలు సర్వే ద్వారా ముందుగానే ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రముఖ సంస్థలు విడుదల చేసిన సర్వేలలో ఈసారి కూడా వైసీపీ పార్టీ భారీ మెజారిటీతో గెలవనున్నట్లు తేల్చి చెప్పాయి.
దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ తరణంలోనే తాజాగా మరో సర్వే వెల్లడించిన ఫలితాలు కూడా వైసీపీకి అనుగుణంగా ఉన్నాయని చెప్పాలి. దీంతో ఇటీవల తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కలిసి ఓట్ బ్యాంకింగ్ పై చర్చలు జరిపారు. ఇక ఈ కార్యక్రమంలో వారు తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2014లో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 47.7% ఓట్ బ్యాంకింగ్ రాగా , వైసీపీకి 45.67% ఓట్లు లభించాయి. ఆ సమయంలో టీడీపీ 2% తేడాతోనే ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత జరిగిన ఓట్ల చీలిక మూలాన టీడీపీ 23 సీట్లకు పడిపోయింది. లేకుంటే ఓడిపోయినప్పటికీ కనీసం 67 సీట్లు దక్కించుకునేది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉండగా దానిలో 147 స్థానాలలో బీజేపీ జనసేన టీడీపీ కలిసినప్పటికీ వచ్చే ఓట్లకి మరియు వైసీపీ ఓట్లకి 2% తేడా మాత్రమే కనిపిస్తుంది. అయితే 2019లో జరిగిన ఓట్లని ఆధారంగా చేసుకుని 2 % అధిక ఓట్లను సాధించినట్లయితే 147 కాన్స్టెన్సీలో గెలిచే అవకాశం ఉందట.
మరి ముఖ్యంగా కర్నూలు మరియు కడపలో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసిన కూడా వైసీపీ ఓట్లకు 10 లక్షల వరకు తేడా ఉంది. ఇక్కడ చాలా పెద్ద వైడ్ మార్జిన్ ఉంది. ఈ నేపథ్యంలోనే 2019లో జరిగిన ఎన్నికల్లో 35% కంటే ఎక్కువ ఓట్లు లభించిన నియోజకవర్గాలలో టీడీపీ నాయకులు గెలుపు కోసం మరింత కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా చూస్తే కూటమి క్యాడర్ మొత్తం కూడా తద్యమని చెబుతున్నాయి. అందుకే గత ఎన్నికల్లో 35% కంటే ఎక్కువ ఓట్లు లభించిన నియోజకవర్గాలలో మరింత ఫోకస్ పెంచి ఎలాగైనా సరే ఈసారి గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.