Balakrishna : జూనియర్ ఎన్టీఆర్ ఎవడ్రా మధ్యలో.. జూనియర్ ఎన్టీఆర్ పరువు తీసిన బాలకృష్ణ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Balakrishna : జూనియర్ ఎన్టీఆర్ ఎవడ్రా మధ్యలో.. జూనియర్ ఎన్టీఆర్ పరువు తీసిన బాలకృష్ణ

Balakrishna : అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎవడు.. వాడెవడో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ కి దమ్ము ఉంది కాబట్టి వచ్చాడు.. జూనియర్ ఎన్టీఆర్ కి ఉందో లేదో వెళ్లి వాడినే అడగండి. పెంట మీద రాయి వేస్లే అది తిరిగి మన మీదే పడుతుందిరా అంటూ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పరువు తీశారు. చంద్రబాబు అరెస్ట్ పై మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చాలా దారుణంగా మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల గురించి కూడా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :5 October 2023,4:00 pm

Balakrishna : అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎవడు.. వాడెవడో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ కి దమ్ము ఉంది కాబట్టి వచ్చాడు.. జూనియర్ ఎన్టీఆర్ కి ఉందో లేదో వెళ్లి వాడినే అడగండి. పెంట మీద రాయి వేస్లే అది తిరిగి మన మీదే పడుతుందిరా అంటూ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పరువు తీశారు. చంద్రబాబు అరెస్ట్ పై మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చాలా దారుణంగా మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు అందరూ కేటీఆర్ జపం చేస్తున్నారు. మరి.. భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి.. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే తీసుకుంటారా అని అడగ్గా.. అసలు బీఆర్ఎస్ లో ఉన్నదే టీడీపీ వాళ్లు. ముఖ్యమంత్రి కూడా ఇక్కడి నుంచి ట్రెయినింగ్ పొంది వెళ్లి ముఖ్యమంత్రి అయిన వ్యక్తే కదా అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

సినిమా వాళ్లు కూడా చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటి వరకు స్పందించలేదని మీడియా వాళ్లు అడగ్గా.. సినిమా వాళ్లు ఎవ్వరూ ఖండించకపోయినా నేను పట్టించుకోను. సినిమాకు సంబంధించింది కాదు.. రాజకీయాలకు సంబంధించింది అనడం తప్పే. వాళ్లూ పౌరులే అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించాడు. ఇంతలో ఎవరో జూనియర్ ఎన్టీఆర్ గురించి అడగ్గా.. వాడిని.. అంటూ అసలు సెక్షనే తీసేశాం దీంట్లో నుంచి అంటూ బాలయ్య మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా మీరు పట్టించుకోరా అని అడగ్గా.. ఐ డోంట్ కేర్.. బ్రో ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య సినిమా డైలాగ్స్ చెప్పుకొచ్చాడు.

balakrishna comments on junior ntr and pawan kalyan

#image_title

Balakrishna : తెలంగాణలో టీడీపీ ఉందో లేదో చూపిస్తా?

బీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో టీడీపీనే లేదంటున్నారు. చూపిస్తాం.. తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉందో చూపిస్తాం అని బాలకృష్ణ సీరియస్ అయ్యారు. బురద మీద రాయి వేస్తే ఏమౌతుంది.. పెంట మీద రాయి వేస్తే ఏమౌతుంది.. మన మీదే పడుతుంది. వాళ్లకే అవన్నీ వదిలేస్తున్నాను.. అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అలాగే.. జనసేనతో పొత్తులపై కూడా బాలకృష్ణ స్పందించారు. త్వరలోనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది