Roja : ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ సభ్యులు అయితే సభలో రచ్చ రచ్చ చేస్తున్నారు. దానికి కారణం.. చంద్రబాబు అరెస్ట్. ఆయన్ను అరెస్ట్ చేయడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కావాలని వైసీపీ ప్రభుత్వమే చంద్రబాబును అరెస్ట్ చేయించిందని అసెంబ్లీలో మండిపడ్డారు. బాలకృష్ణ అయితే ఒక అడుగు ముందుకు వేసి అసెంబ్లీలోనే మీసాలు తిప్పడం, తొడ కొట్టడం చేశారు. అంతే కాదు విజిల్ కూడా వేశారు. రచ్చ రచ్చ చేశారు. దానిపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తాజాగా అసెంబ్లీలో రోజా చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ కోపంగా చూశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసెంబ్లీలో రోజా మాట్లాడుతూ.. ఈ శాసనసభను అవమానించారు. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీకి నోటీసులు ఇచ్చి వాటిపై ఓటింగ్ పెట్టి సెలక్ట్ కమిటీకి పంపుతున్నామంటే మాకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. శాసనమండలిలో అక్కడ వీళ్లు చేసిన పనులు ఏంటి అధ్యక్షా. చంద్రబాబు చేసిన కుట్ర దారుణమైనది కాదా? అధికారం కోల్పోయినా కూడా అహంకారంతో చంద్రబాబు వ్యవహరించారు. నారా లోకేష్ ఒక ఎమ్మెల్సీగా కూడా అర్హుడు కాదు. ఆయన ప్రజలతో ఎన్నుకోబడలేదు కాబట్టే ఆయనకు శాసనసభ, శాసనమండలి విలువ తెలియదు అంటూ రోజా నారా లోకేష్ పై సీరియస్ అయ్యారు.
చంద్రబాబు ఏమన్నా పతీతనా.. ఆయన ఎలాంటి అక్రమాలు చేశారో సాక్ష్యాధారాలతో సహా నిరూపితం అయింది. చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో కూర్చున్నారు. ఇక ఆ ఇంటికే చెందిన దద్దమ్మ, దద్దోజనం.. ఆయనకు ఏం మాట్లాడుతాడో ఎవ్వరికీ తెలియదు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వ్యవస్థలను బ్రష్టుపట్టించడంలో చంద్రబాబుది ఎంత పాత్ర ఉందో.. యెనమలది కూడా అంతే ఉంది. చంద్రబాబు పతీత కాదు.. ఆయన కొడుకు అంతకంటే కాదు. వీళ్ల తోక జాడింపులకు, వీళ్ల తాటాకు చప్పుళ్లకు ఇక్కడ భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు అంటూ రోజా శాసనసభలో మండిపడ్డారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.