Categories: Newspolitics

Potti Sriramulu : మాల మాదిగల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు.. ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి

Potti Sriramulu : పొట్టి శ్రీరాములు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రుల గాంధీ అని కూడా ఆయనను పిలవచ్చు. పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 25 ఏళ్ల వయసులోనే శ్రీరాములుకు అన్నింటిపై విరక్తి వచ్చింది. అందుకే ఆయన 25 ఏళ్లకే అన్నింటినీ వదిలేసి స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీతో కలిసి నడిచారు. నిస్వార్థతకు ఆయన మారు పేరు. శ్రీరాములు గురువు మహాత్మా గాంధీ. సబర్మతి ఆశ్రమంలో ఉంటూ గాంధీ అడుగు జాడల్లో నడిచేవారు శ్రీరాములు.

గాంధీజీకి కూడా శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. శ్రీరాములు లాంటి కార్యదీక్షా పరులు చాలా తక్కువగా ఉంటారని గాంధీజీ అప్పట్లో చెబుతుండేవారు. అప్పట్లో హరిజనులను ఆలయాల్లోకి రానిచ్చేవారు కాదు. దానిపై శ్రీరాములు ఎప్పుడూ పోరాడుతూ ఉండేవారు. హరిజన దేవాలయ ప్రవేశమే అస్పృశ్యతానివారణ అని.. ఏకపంక్తి భోజనముతోనే కులతత్వాలను పోగొట్టుకోవచ్చని పొట్టి శ్రీరాములు చెబుతూ ఉంటారు. అందుకే హరిజనులను కూడా దేవాలయాల్లోకి రానిచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు పొట్టి శ్రీరాములు. అయినా కూడా ఎక్కడో ఒక చోట హరిజనులను చిన్నచూపూ చూస్తూనే ఉండేవారు.

Potti Sriramulu : హరిజనుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు

మద్రాస్ ప్రావిన్స్ లో ఉన్న అన్ని దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలని 1946, నవంబర్ 25న పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే.. కొద్ది రోజుల్లోనే స్వాతంత్రం రావచ్చని అందరూ ఆశాభావంతో ఉండి అందరూ స్వాతంత్ర్య ఉద్యమం మీదనే ఉండేది. దీంతో కాంగ్రెస్ నాయకులు అందరూ పొట్టి శ్రీరాములును ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని కోరారు. కానీ.. శ్రీరాములు వాళ్ల మాట వినలేదు. దీంతో అందరూ గాంధీజీని వెళ్లి శ్రీరాములు దీక్ష గురించి చెప్పారు.

దీంతో శ్రీరాములు దీక్షను విరమింపజేస్తాడు గాంధీ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీరాములు నెల్లూరు జిల్లాకు మారి అక్కడే ఉన్నారు. స్వాతంత్ర్యం తర్వాత హరిజనోద్దరణకు కృషి చేశారు. రోడ్ల మీద నడుస్తూ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, ఎండకు గొడుగు కూడా లేకుండా హరిజనుల కోసం ఎంతో కృషి చేశారు పొట్టి శ్రీరాములు. ఒకానొక సమయంలో శ్రీరాములును చూసి అందరూ పిచ్చివాడు అని నవ్వుకునే వారు. కానీ.. ఆ పిచ్చివాడే ఆంధ్రుల ఆత్మగౌరవం అయిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.

biography-of-potti-sriramulu

అప్పట్లో ఆంధ్రా.. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండేది. టంగుటూరి ప్రకాశం పంతులు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కొన్నేళ్ల తర్వాత ఆయ పదవీచ్యితుడు అయ్యారు. స్వాతంత్య్రం వచ్చినా కూడా తెలుగు వారికి గుర్తింపు ఉండేది కాదు. తమిళులదే అక్కడ రాజ్యం. రాజాజి ప్రభుత్వం కూడా తెలుగు వారిని అణచివేసేది.ఎలాగైనా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందే అని నిర్ణయించుకున్న పొట్టి శ్రీరాములు నేరుగా మద్రాసుకు వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కానీ.. అప్పట్లో శ్రీరాములుకి కనీసం తెలుగు వాళ్లు కూడా మద్దతు ఇవ్వలేకపోయారు.

టంగుటూరు ప్రకాశం పంతులు మాత్రం ఆయనకు మద్దతు ఇచ్చారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినా కనీసం తెలుగు వాళ్లు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. 58 రోజుల తర్వాత ఆయన చిక్కశీల్యం అయ్యారు. ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగు వాళ్లు రాలేదు. కానీ.. పొట్టి శ్రీరాములు వెంట సాదు సుబ్రహ్మణ్య శాస్త్రి మాత్రం ఉన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చారు. కానీ.. 58 రోజుల పాటు ఏం తినకుండా, తాగకుండా పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో కన్నుమూశారు. చివరకు ఆయనకు దహన సంస్కారాలు చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో.. సాదు సుబ్రహ్మణ్య శాస్త్రి గుడివాడ వాళ్లను సాయం అడుగుదామని ఘంటసాలకు ఈ విషయం చెప్పడంతో.. ఘంటసాలతో పాటు పలువురు వచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

కానీ.. ఎవరికోసం అయితే అశువులు బాసాడో వాళ్లే పట్టించుకోలేదు అని ఒక ఎడ్ల బండి మీద శ్రీరాములు శవాన్ని వేసుకొని ఘంటసాల తెలుగు వారిని తిడుతూ పాటలు పాడటంతో అప్పుడు కొందరు తెలుగు వాళ్లు ఆ శవయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికైనా తెలుగు వాళ్లు రండి అంటూ పాటలు పాడటంతో తెలుగు వారిలో అప్పుడు కానీ ఉక్రోశం రాలేదు. మద్రాస్ ప్రావిన్స్ మొత్తాన్ని ఆంధ్రులు తగులబెట్టడంతో అప్పుడు రాజాజీని శాంతించాలని చెప్పిన అప్పటి ప్రధాని నెహ్రూ శ్రీరాములు మరణం వృధా పోదని పార్లమెంట్ లో ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఇస్తామని ప్రకటించారు. దీంతో తెలుగు వారు శాంతించారు.

Recent Posts

Kannappa Movie Review : క‌న్న‌ప్ప మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kannappa Movie Review : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…

6 hours ago

kannappa Movie : క‌న్నప్ప ప్రెస్ మీట్‌.. ఆయ‌న‌కి సినిమా ఎప్పుడు చూపిస్తార‌న్న ప్ర‌శ్న‌కి విష్ణు ఆస‌క్తిక‌ర స‌మాధానం.. వీడియో !

kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.…

8 hours ago

Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం… అలా కవర్ చేశాడు..! వీడియో

Ram charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా…

8 hours ago

Subhanshu Shukla : అంతరిక్షంలోకి అడుగుపెట్టిన శుభాంశు శుక్లా బృందం..!

Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారతీయుడు శుభాంశు…

9 hours ago

Father : కన్నబిడ్డలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తిని దేవాలయానికి రాసిచ్చిన తండ్రి.. అస‌లు ట్విస్ట్ ఇప్పుడే మొద‌లు..!

Father  : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…

10 hours ago

Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!

Daughter : హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…

11 hours ago

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…

12 hours ago

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

13 hours ago