Categories: Newspolitics

Potti Sriramulu : మాల మాదిగల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు.. ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి

Advertisement
Advertisement

Potti Sriramulu : పొట్టి శ్రీరాములు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రుల గాంధీ అని కూడా ఆయనను పిలవచ్చు. పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 25 ఏళ్ల వయసులోనే శ్రీరాములుకు అన్నింటిపై విరక్తి వచ్చింది. అందుకే ఆయన 25 ఏళ్లకే అన్నింటినీ వదిలేసి స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీతో కలిసి నడిచారు. నిస్వార్థతకు ఆయన మారు పేరు. శ్రీరాములు గురువు మహాత్మా గాంధీ. సబర్మతి ఆశ్రమంలో ఉంటూ గాంధీ అడుగు జాడల్లో నడిచేవారు శ్రీరాములు.

Advertisement

గాంధీజీకి కూడా శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. శ్రీరాములు లాంటి కార్యదీక్షా పరులు చాలా తక్కువగా ఉంటారని గాంధీజీ అప్పట్లో చెబుతుండేవారు. అప్పట్లో హరిజనులను ఆలయాల్లోకి రానిచ్చేవారు కాదు. దానిపై శ్రీరాములు ఎప్పుడూ పోరాడుతూ ఉండేవారు. హరిజన దేవాలయ ప్రవేశమే అస్పృశ్యతానివారణ అని.. ఏకపంక్తి భోజనముతోనే కులతత్వాలను పోగొట్టుకోవచ్చని పొట్టి శ్రీరాములు చెబుతూ ఉంటారు. అందుకే హరిజనులను కూడా దేవాలయాల్లోకి రానిచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు పొట్టి శ్రీరాములు. అయినా కూడా ఎక్కడో ఒక చోట హరిజనులను చిన్నచూపూ చూస్తూనే ఉండేవారు.

Advertisement

Potti Sriramulu : హరిజనుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు

మద్రాస్ ప్రావిన్స్ లో ఉన్న అన్ని దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలని 1946, నవంబర్ 25న పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే.. కొద్ది రోజుల్లోనే స్వాతంత్రం రావచ్చని అందరూ ఆశాభావంతో ఉండి అందరూ స్వాతంత్ర్య ఉద్యమం మీదనే ఉండేది. దీంతో కాంగ్రెస్ నాయకులు అందరూ పొట్టి శ్రీరాములును ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని కోరారు. కానీ.. శ్రీరాములు వాళ్ల మాట వినలేదు. దీంతో అందరూ గాంధీజీని వెళ్లి శ్రీరాములు దీక్ష గురించి చెప్పారు.

దీంతో శ్రీరాములు దీక్షను విరమింపజేస్తాడు గాంధీ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీరాములు నెల్లూరు జిల్లాకు మారి అక్కడే ఉన్నారు. స్వాతంత్ర్యం తర్వాత హరిజనోద్దరణకు కృషి చేశారు. రోడ్ల మీద నడుస్తూ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, ఎండకు గొడుగు కూడా లేకుండా హరిజనుల కోసం ఎంతో కృషి చేశారు పొట్టి శ్రీరాములు. ఒకానొక సమయంలో శ్రీరాములును చూసి అందరూ పిచ్చివాడు అని నవ్వుకునే వారు. కానీ.. ఆ పిచ్చివాడే ఆంధ్రుల ఆత్మగౌరవం అయిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.

biography-of-potti-sriramulu

అప్పట్లో ఆంధ్రా.. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండేది. టంగుటూరి ప్రకాశం పంతులు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కొన్నేళ్ల తర్వాత ఆయ పదవీచ్యితుడు అయ్యారు. స్వాతంత్య్రం వచ్చినా కూడా తెలుగు వారికి గుర్తింపు ఉండేది కాదు. తమిళులదే అక్కడ రాజ్యం. రాజాజి ప్రభుత్వం కూడా తెలుగు వారిని అణచివేసేది.ఎలాగైనా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందే అని నిర్ణయించుకున్న పొట్టి శ్రీరాములు నేరుగా మద్రాసుకు వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కానీ.. అప్పట్లో శ్రీరాములుకి కనీసం తెలుగు వాళ్లు కూడా మద్దతు ఇవ్వలేకపోయారు.

టంగుటూరు ప్రకాశం పంతులు మాత్రం ఆయనకు మద్దతు ఇచ్చారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినా కనీసం తెలుగు వాళ్లు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. 58 రోజుల తర్వాత ఆయన చిక్కశీల్యం అయ్యారు. ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగు వాళ్లు రాలేదు. కానీ.. పొట్టి శ్రీరాములు వెంట సాదు సుబ్రహ్మణ్య శాస్త్రి మాత్రం ఉన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చారు. కానీ.. 58 రోజుల పాటు ఏం తినకుండా, తాగకుండా పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో కన్నుమూశారు. చివరకు ఆయనకు దహన సంస్కారాలు చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో.. సాదు సుబ్రహ్మణ్య శాస్త్రి గుడివాడ వాళ్లను సాయం అడుగుదామని ఘంటసాలకు ఈ విషయం చెప్పడంతో.. ఘంటసాలతో పాటు పలువురు వచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

కానీ.. ఎవరికోసం అయితే అశువులు బాసాడో వాళ్లే పట్టించుకోలేదు అని ఒక ఎడ్ల బండి మీద శ్రీరాములు శవాన్ని వేసుకొని ఘంటసాల తెలుగు వారిని తిడుతూ పాటలు పాడటంతో అప్పుడు కొందరు తెలుగు వాళ్లు ఆ శవయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికైనా తెలుగు వాళ్లు రండి అంటూ పాటలు పాడటంతో తెలుగు వారిలో అప్పుడు కానీ ఉక్రోశం రాలేదు. మద్రాస్ ప్రావిన్స్ మొత్తాన్ని ఆంధ్రులు తగులబెట్టడంతో అప్పుడు రాజాజీని శాంతించాలని చెప్పిన అప్పటి ప్రధాని నెహ్రూ శ్రీరాములు మరణం వృధా పోదని పార్లమెంట్ లో ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఇస్తామని ప్రకటించారు. దీంతో తెలుగు వారు శాంతించారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

7 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

8 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

9 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

10 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

11 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

12 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

13 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

14 hours ago

This website uses cookies.