
Chandrababu : ఓ వైపు లడ్డు వ్యవహారం, మరోవైపు జగన్ డిక్లరేషన్.. చంద్రబాబు నిర్ణయం ఏంటంటే..!
Chandrababu : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా రంజుగా సాగుతుంది. ఒకవైపు జగన్పై చంద్రబాబు విమర్శలు చేస్తుంటే మరోవైపు చంద్రబాబుపై జగన్ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. జగన్ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు, జనసమీకరణలు చేయవద్దని మాత్రమే చెప్పామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రమని, భక్తులు పవిత్రంగా భావించే క్షేత్రాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆచారాలు పాటించకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, ఇంతకుముందు జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్లారని తెలిపారు. చాలామంది డిక్లరేషన్ ఇచ్చి గౌరవంగా దర్శనం చేసుకున్నారన్న చంద్రబాబు, ఇతర మతాలను గౌరవించడం అంటే ఆయా ఆలయాల సంప్రదాయాలను పాటించడమే అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న విచిత్ర పరిణామాల మధ్య చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టగా, వాటి విలువ 3,000 కోట్ల రూపాయలు. అక్టోబర్ 1వ తేదీన ఇవి వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ద్వారా వేలం పాట సాగుతుంది..కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది రిజర్వ్ బ్యాంక్. ఈ బాండ్ల కాల వ్యవధి ఒకటి- 14, మరొకటి- 20, ఇంకొకటి-24 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం ఇది అయిదోసారి.
Chandrababu : ఓ వైపు లడ్డు వ్యవహారం, మరోవైపు జగన్ డిక్లరేషన్.. చంద్రబాబు నిర్ణయం ఏంటంటే..!
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నెల రోజుల్లో 2,000 కోట్ల రూపాయల చొప్పున బాండ్లను వేలం పాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో 5,000 కోట్ల రూపాయల సమీకరణకు పూనుకుంది. మూడో విడతలో 2,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ వద్ద రుణాల ద్వారా సేకరించింది. నాలుగో విడతలో మరో 3,000 కోట్ల రూపాయల సమీకరించింది. అప్పటికే ఈ మొత్తం కలిపి 12,000 కోట్ల రూపాయలు రుణభారం రాష్ట్ర ప్రజలపై పడినట్టయింది. వేల కోట్లు.. ఇప్పుడు తాజాగా మరో 3,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్.. మొత్తంగా ఆయా ప్రభుత్వాల నుంచి 19,942 కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వేలం వేయనుండడం విశేషం.
Vivo T5 Pro 5G : భారతదేశంలో స్మార్ట్ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివో టి5 ప్రో 5జి…
Chityala : చిట్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో రూ.1.65 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన నిర్మాణ పనులకు ప్రభుత్వ…
Farmers : దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరుగుతున్న…
Govt Jobs : ప్రస్తుతం ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రైవేట్ కంపెనీల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ…
Summer Holidays 2026 : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు మండిపడుతూ…
Gold Silver Rates April 9th 2026 : పసిడి ప్రియులకు, ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది…
Karthika Deepam 2 April 9th 2026 Episode | స్టార్ మా లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2'…
Dry fruits : సాధారణంగా డ్రైఫ్రూట్స్ అంటే మనకు ఆరోగ్యానికి మేలు చేసే తిండి అనే భావన వెంటనే గుర్తుకు…
Kiwi Fruit : నేటి వేగవంతమైన జీవనశైలి, అసమతుల ఆహారపు అలవాట్లు కారణంగా మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు…
Tea : ఉదయాన్నే నిద్రలేవగానే వేడివేడి టీ కప్పుతో రోజును ప్రారంభించడం చాలామందికి ఒక అలవాటు మాత్రమే కాదు, ఒక…
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
This website uses cookies.