Chiranjeevi : "అల్లు" డి కోసం హస్తినలో "మెగా" మంతనాలు.. తగ్గేదేలే అంటున్న రేవంత్రెడ్డి..!
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. కొన్ని రోజుల కిందట అల్లు అర్జున్ అరెస్ట్ కాగా, ఆ తర్వాత బెయిల్పై బయటకి వచ్చాడు. జనవరి 21 వరకూ ఆయనకు బెయిల్ ఉంటుంది. ఐతే.. తెలంగాణ పోలీసులు ఆయన బెయిల్ రద్దు కోసం ఇవాళ హైకోర్టులో పిటిషన్ వెయ్యబోతున్నారని తెలిసింది. హైకోర్టు బెయిల్ ఇస్తూ.. కొన్ని కండీషన్లు పెట్టింది. కానీ అల్లు అర్జున్ ఆ కండీషన్స్ అమలు చెయ్యకుండా.. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారనీ, మళ్లీ మళ్లీ ప్రెస్మీట్లు పెడుతున్నారని పోలీసులు ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ఇలా ప్రెస్మీట్ పెట్టిన విషయం పెద్ద దుమారం రేపుతోంది. ఇది బెయిల్ రూల్స్కి విరుద్ధమే అంటున్నారు పోలీసులు.
Chiranjeevi : “అల్లు” డి కోసం హస్తినలో “మెగా” మంతనాలు.. తగ్గేదేలే అంటున్న రేవంత్రెడ్డి..!
అయితే రోజు రోజుకి అల్లు అర్జున్ వ్యవహారం హాట్ టాపిక్గా మారగా, ఆయన ఢిల్లీ నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగాస్టార్ ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుసక్తుంది. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు చిరంజీవి స్పందించింది లేదు. బాధిత కుటుంబానికి సినిమా ముఖ్యులు బాసటగా నిలవకపోవటం పైనా ముఖ్యమంత్రి శాసన సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో, రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా, అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుగా చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు వీడియో విడుదల చేశారు. బయట తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని అల్లు అర్జున్కు చెప్పేందుకు ప్రయత్నించామని.. మేనేజర్ తాను చెప్తా అన్నాడని వెల్లడించారు. దయచేసి థియేటర్ నుంచి వెళ్లిపోండి అని అల్లు అర్జున్కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారని వివరించారు. తొక్కిసలాట విషయం అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లానని, మహిళ చనిపోయింది, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పానని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ వెల్లడించారు. అప్పుడు సినిమా మొత్తం చూశాకే తాను వెళ్తానని అల్లు అర్జున్ అన్నాడని చెప్పారు.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్వర్డ్ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.