Revanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 రోజులు అవుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే అభయ హస్తం స్కీమ్ కింద ఆరు గ్యారెంటీ స్కీమ్ ల మీద సంతకం పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే మహాలక్ష్మీ స్కీమ్ లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ లాంచ్ అయింది. తాజాగా ప్రజా పాలన పేరుతో అభయ హస్తం స్కీమ్ లోని ఇతర 5 స్కీమ్ ల కోసం దరఖాస్తును స్వీకరిస్తున్నారు. రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మీ, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు లాంటి స్కీమ్స్ అన్నింటికీ ఒకే దరఖాస్తును తీసుకొచ్చారు. దానికి ప్రజా పాలన పేరు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
99,999 కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి. లక్ష కోట్ల సంపాదనలో ఒక లక్ష పోయినా మిగితావి ఉన్నాయి. అవన్నీ పంచాలి. వాటిని పంచాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం. అవి పంచకుండా తప్పదు అని చెప్పుకొచ్చారు. మేము ఉన్న వాస్తవాలు బయటపెట్టాం. మా ఆర్థిక మంత్రి వాస్తవాలను టేబుల్ చేసి మీరేం చెబుతారో చెప్పండి అని రోజంతా సమయం ఇచ్చాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి వెళ్లి మరో దుకాణం తెరిచారు. వాళ్ల దగ్గర ఉన్న ఆస్తి ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద. ఈరోజు వాళ్లు తింటున్నారంటే అది రక్తపు కూడు. మా వాళ్లు ఏం చెప్పారు.. నిజంగా ఉపయోగ పడే వాటిని కూలగొట్టి మళ్లీ నిర్మించారని అన్నారు.
సచివాలయమే తీసుకోండి. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం.. 2012 లో ఎల్ అండ్ టీ కంపెనీ కట్టిన భవనం అది. 12 లక్షల స్కైర్ ఫీట్ ఉండేది. ఆ రాష్ట్రం తరలిపోయాక అంతా మనకే ఉండేది. ఇతర ప్రభుత్వ ఆఫీసులు కూడా ఇక్కడికే తెచ్చి పెట్టాల్సి ఉంది. ఒకవేళ మీకు ఇది అచ్చిరాకపోతే దీన్ని ఏదైనా ఆసుపత్రిగానో.. వేరే ప్రభుత్వ డిపార్ట్ మెంట్ గా ఏర్పాటు చేసి ఖాళీ జాగలో కొత్త సచివాలయాన్ని కడితే ఇదీ ఉపయోగపడుతుండేది.. అక్కడ అది ఉపయోగపడుతూ ఉండేది. అక్కడ కూలగొట్టి భవనాలు కట్టారు. ఉన్నదాన్ని కూలగొట్టి కొత్త భవనాలు కట్టారంటే వాళ్లు ఎందుకు కట్టారో అర్థం చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.