Ys Jagan : బిగ్ బ్రేకింగ్‌.. విద్యార్థుల‌కు మ‌రో గుడ్‌న్యూస్ చెప్పిన జ‌గ‌న‌న్న‌..!

Ys Jagan  : ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న విద్యా దీవెన నిధులను విడుదల చేయబోతోంది. జూలై , సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి 584 కోట్లను 8,09,039 మంది విద్యార్థుల కోసం ఇస్తుంది. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ డబ్బును బటన్ నొక్కి తల్లుల విద్యార్థులు జాయింట్ బ్యాంక్ అకౌంట్లలో నేరుగా ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జమ చేయబోతున్నారు. దాంతో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుందని సంతోషంలో ఉన్నారు. అందువల్ల సీఎం బటన్ నొక్కిన తర్వాత లబ్ధిదారులు తమ ఎకౌంట్లో డబ్బు వచ్చింది లేనిది చూసుకోవాలి. ఇవాళ ఎకౌంట్లో డబ్బు రాకపోతే బ్యాంక్ అధికారులను సంప్రదించవచ్చు. జగనన్న విద్యా దీవెన కింద ఇవాళ వస్తున్న 584 కోట్లతో కలిపి ఇప్పటివరకు విద్యా దీవెన వసతి దీవెన పథకాల కింద వైసీపీ ప్రభుత్వం రూ. 18,576 కోట్లు ఇచ్చినట్లు అవుతుంది.

ఇది గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ అని ప్రభుత్వం చెబుతోంది. వై.యస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలు చేశారుష పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలని ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఐటిఐ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించే ఫీజులను వారి బదులు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకోసం మూడు నెలలకు ఒకసారి డబ్బుని లబ్ధిదారుల ఎకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఆ డబ్బును మధ్యవర్తులు ఎవరు పొందే అవకాశం లేకుండా నేరుగా తల్లుల ఎకౌంట్లో జమ అవుతాయి. ఆ తర్వాత కాలేజీల యాజమాన్యాలు వారి నుంచి ఆ డబ్బును తీసుకుంటున్నాయి.

పేద విద్యార్థులు భోజనం, హాస్టల్ ఖర్చులకోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో వైసీపీ ప్రభుత్వం ఐటిఐ విద్యార్థులకు రూ.10,000 పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15000,డిగ్రీ , ఇంజనీరింగ్ , మెడిసిన్ వంటి కోర్సులు చేసే వారికి 20 వేల చొప్పున డబ్బును అందిస్తుంది. దీని ద్వారా విద్యార్థులు డబ్బు సమస్యలు లేకుండా చదువుకోడానికి వీలవుతుందని జగన్ సర్కార్ చెబుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్ల కాలంలో విద్యారంగంపై రూ. 73,417 కోట్లు ఖర్చు చేసినట్లు అవుతుంది. ఈ పథకాల ప్రయోజనం పొందుతున్న విద్యార్థులు రేపు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వం ఆశిస్తుంది. వారి ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ప్రభుత్వం నమ్ముతుంది. పేద విద్యార్థులు డబ్బు లేక చదువు ఆపకూడదని జగన్ సర్కార్ ఇలాంటి పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా చాలామంది పేద విద్యార్థులు చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీనివలన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.

Recent Posts

KTR Responds : ఫస్ట్ టైం కవిత ఇష్యూ పై స్పందించిన కేటీఆర్

KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…

6 hours ago

New Scheme for Women : డ్వాక్రా మహిళల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…

7 hours ago

AI దెబ్బకు ఒరాకిల్‌లో రోడ్డున పడ్డ 3 వేల మంది ఉద్యోగులు

AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…

8 hours ago

Romance : పబ్లిక్ గా ట్రైన్ లో అందరు చూస్తుండగా ముద్దుల్లో తేలిన జంట

సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…

9 hours ago

Good News : నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన ఏపీ ప్రభుత్వం!

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…

10 hours ago

Mobile Offer | కేవలం ₹2,149కే 5G ఫోన్?.. Oppo K13x పై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్

Mobile Offer | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్‌తో మార్కెట్‌ను ఊపేస్తోంది. అత్యాధునిక…

11 hours ago

Ganesh Chaturthi Boosts | గణేష్ చతుర్థి 2025: భక్తి పండుగ మాత్రమే కాదు… రూ. 45,000 కోట్ల వ్యాపారం!

Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…

12 hours ago

Melbourne Airport | మల్లెపూల మాల కోసం భారీ జరిమానా… నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియాలో ఇబ్బందులు!

Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్‌పోర్ట్‌లో ఊహించ‌ని అనుభవం ఎదురైంది. ఓనం…

13 hours ago