Categories: NewspoliticsTelangana

CM Revanth Reddy : అసెంబ్లీలో సాక్షి పరువు తీసిన రేవంత్ రెడ్డి .. కేసీఆర్ – వైఎస్ జగన్ సీక్రెట్స్ మొత్తం బయట పెట్టిన సీఎం..!

Advertisement
Advertisement

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ శాఖ పై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు కలిసి ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని వ్యాఖ్యలు చేశారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాల వినియోగంపై అధికారులు పూర్తి నివేదిక ఇచ్చారని, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికలోని అంశాలను సభ ముందు ఉంచుతున్నానని, రాష్ట్రంలో అన్యాయం జరిగిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరిగిందని అన్నారు. కాళేశ్వరం నుంచి నీటి తరలింపు ఆర్థిక భారం అని నిపుణులు అప్పుడే చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం సరికాదని కేసీఆర్ కు నిపుణులు తెలియజేశారు. 14 పేజీలతో రిటైర్డ్ ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీ ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు సాధ్యమని నివేదిక ఇచ్చింది.

Advertisement

మేడిగడ్డ కట్టాలన్నది కేసీఆర్ ఆలోచన. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఆదేశించారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కిపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజానీకానికి ఆటంకంగా మారింది. దోచుకోవాలని దాచుకోవాలని ఆలోచనతోనే మేడిగడ్డ నిర్మించారు. కూలిన ప్రాజెక్టును చూసి సిగ్గుపడాలి. ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురు దాడి చేస్తుంది. తెలంగాణ ఇచ్చింది మేమే. తెచ్చింది కూడా మేమే. ఇకనైనా తప్పులు ఒప్పుకోండి కప్పిపుచ్చుకోండి అని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలు తొలగించడానికి బోర్డు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. హరీష్ రావు, కేసీఆర్ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. వాళ్లు నియమించుకున్న ఇంజనీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు. తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని నివేదిక ఇప్పించుకున్నారు.

Advertisement

ఇక తొమ్మిది సంవత్సరాల క్రితం మేడిగడ్డ మేడిపండేనా అని సాక్షి దినపత్రికలో కథనం కూడా వచ్చింది. కేసీఆర్ దోస్తీ అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలోనే మిత్రుడికి వ్యతిరేకంగా మేడిగడ్డపై కథనం రాశారు అని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టడం సరికాదు కాబట్టే సాక్షి దినపత్రిక కూడా దానిపై కథనం కూడా రాసింది. ప్రజలు నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే తెలంగాణను నిండా ముంచారు. కాళేశ్వరం తో చేవెళ్లకు అన్యాయం చేశారని ఆనాడు సబితా ఇంద్రారెడ్డి ధర్నా చేశారు. నేడు ఇదే సభలో హరీష్ రావు అబద్ధాలు చెబుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తున్నారు. ప్రాజెక్టులకు సాగునీటి మంత్రిగా కొనసాగి ఆ తర్వాత హరీష్ రావు ని ఎందుకు భర్తరఫ్ చేశారు. విచారణకు వెళ్లి ఇప్పటికైనా తప్పును ఒప్పుకోండి అంటూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

42 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.