
Rajya Sabha : రాజ్యసభ సీట్ల భర్తీలో కూటమి ప్రభుత్వానికి సమ ప్రాధాన్యం.. లైన్లో మెగా, నందమూరి వారసులు..!
Rajya Sabha : ఆంధ్రప్రదేశ్లో వైఎస్సాఆర్సీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు (మోపిదేవి, మస్తాన రావు, క్రిష్ణయ్య) ఇప్పటికే రాజీనామా చేశారు. ఆ ఖాళీల భర్తీకి ఏపీలో కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముగ్గురు సభ్యుల ఎంపిక పైన సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పవన్, బీజేపీతో నాయకత్వంతో చర్చిస్తున్నారు. అందులో భాగంగా మొదట రెండు సీట్లు టీడీపీకి, ఒకటి జనసేనకు ఇవ్వాలని భావించినా.. మూడు పార్టీలకు ఒక్కో సీటు ఖరారు దిశగా నిర్ణయం జరిగినట్లు సమాచారం. అభ్యర్ధుల ఎంపిక సైతం దాదాపు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది.
రాజీనామా చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో మస్తాన్రావు, మోపిదేవి టీడీపీలో చేరారు. మస్తాన్రావుకు తిరిగి రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ ఉంది. ముగ్గురూ బీసీ వర్గాలకు చెందిన వారు కావడతో ఇప్పుడు కొత్తగా రాజ్యసభకు పంపేవారి విషయంలో కూటమి నేతలు ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి పూర్తి బలం ఉండటంతో మూడు స్థానాలు వీరికే దక్కనున్నాయి. అందులో భాగంగా జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు దాదాపు ఖరారైనట్లుగా సమాచారం.
టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ రేసులో ఉన్నప్పటికీ నందమూరి సహాసిని పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత దిశగా ఈ ప్రతిపాదన అని సమాచారం. ఇదే సమయంలో గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్లు సైతం వినిపిస్తున్నాయి.
Rajya Sabha : రాజ్యసభ సీట్ల భర్తీలో కూటమి ప్రభుత్వానికి సమ ప్రాధాన్యం.. లైన్లో మెగా, నందమూరి వారసులు..!
ఇక బీజేపీకి ఒక సీటు ఇవ్వాలనే ప్రతిపాదన సైతం ఉంది. త్వరలో వైసీపీ నుంచి మరో రాజ్యసభ సభ్యుడి రాజీనామా ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. అదే జరిగితే బీజేపీకి అవకాశం ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే బీజేపీకి ఈ మూడు స్థానాల్లోనే ఒకటి ఇవ్వాలని తాజాగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీకి సీటు ఖాయమైతే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి దక్కే ఛాన్స్ ఉందని పార్టీలో ప్రచారం కొనసాగుతుంది. ఏదిఏమైనప్పటికీ అభ్యర్ధుల తుది ఎంపిక పైన మూడు పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతుంది.
Virosh Jodi : తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ –…
Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్ఫోన్ను తక్కువ…
Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…
PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…
womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…
USA Target : అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటనేది పెద్ద ప్రశ్నగా…
Free Gas Cylinder Scheme : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు అమలులో ఉన్న దీపం పథకం…
This website uses cookies.