
Rajya Sabha : రాజ్యసభ సీట్ల భర్తీలో కూటమి ప్రభుత్వానికి సమ ప్రాధాన్యం.. లైన్లో మెగా, నందమూరి వారసులు..!
Rajya Sabha : ఆంధ్రప్రదేశ్లో వైఎస్సాఆర్సీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు (మోపిదేవి, మస్తాన రావు, క్రిష్ణయ్య) ఇప్పటికే రాజీనామా చేశారు. ఆ ఖాళీల భర్తీకి ఏపీలో కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముగ్గురు సభ్యుల ఎంపిక పైన సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పవన్, బీజేపీతో నాయకత్వంతో చర్చిస్తున్నారు. అందులో భాగంగా మొదట రెండు సీట్లు టీడీపీకి, ఒకటి జనసేనకు ఇవ్వాలని భావించినా.. మూడు పార్టీలకు ఒక్కో సీటు ఖరారు దిశగా నిర్ణయం జరిగినట్లు సమాచారం. అభ్యర్ధుల ఎంపిక సైతం దాదాపు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది.
రాజీనామా చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో మస్తాన్రావు, మోపిదేవి టీడీపీలో చేరారు. మస్తాన్రావుకు తిరిగి రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ ఉంది. ముగ్గురూ బీసీ వర్గాలకు చెందిన వారు కావడతో ఇప్పుడు కొత్తగా రాజ్యసభకు పంపేవారి విషయంలో కూటమి నేతలు ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి పూర్తి బలం ఉండటంతో మూడు స్థానాలు వీరికే దక్కనున్నాయి. అందులో భాగంగా జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు దాదాపు ఖరారైనట్లుగా సమాచారం.
టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ రేసులో ఉన్నప్పటికీ నందమూరి సహాసిని పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత దిశగా ఈ ప్రతిపాదన అని సమాచారం. ఇదే సమయంలో గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్లు సైతం వినిపిస్తున్నాయి.
Rajya Sabha : రాజ్యసభ సీట్ల భర్తీలో కూటమి ప్రభుత్వానికి సమ ప్రాధాన్యం.. లైన్లో మెగా, నందమూరి వారసులు..!
ఇక బీజేపీకి ఒక సీటు ఇవ్వాలనే ప్రతిపాదన సైతం ఉంది. త్వరలో వైసీపీ నుంచి మరో రాజ్యసభ సభ్యుడి రాజీనామా ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. అదే జరిగితే బీజేపీకి అవకాశం ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే బీజేపీకి ఈ మూడు స్థానాల్లోనే ఒకటి ఇవ్వాలని తాజాగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీకి సీటు ఖాయమైతే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి దక్కే ఛాన్స్ ఉందని పార్టీలో ప్రచారం కొనసాగుతుంది. ఏదిఏమైనప్పటికీ అభ్యర్ధుల తుది ఎంపిక పైన మూడు పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతుంది.
Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో…
Modi : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…
Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చాలు దాహం వేధించడం మొదలవుతుంది. అలాంటి వేళలో మనకు వెంటనే గుర్తొచ్చేది చల్లని…
Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
This website uses cookies.