godavari districts deciding jagan and chandrababu fate
YS Jagan Mohan Reddy – Chandrababu : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమరం మొదలైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో ఏపీలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అయితే.. ఏపీలో ఎన్నికలను ఎక్కువగా ప్రభావితం చేసేవి మాత్రం గోదావరి జిల్లాలు అనే చెప్పుకోవాలి. ఇప్పుడే కాదు.. చాలా సంవత్సరాల నుంచి గోదావరి జిల్లాలే ఏపీ రాజకీయాలను శాసించాయి అనే చెప్పుకోవాలి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలు 34 మాత్రమే. కానీ.. ఆ నియోజకవర్గాల రిజల్టే స్టేట్ అంతా ప్రభావం చూపిస్తుంది. ఏపీలో గోదావరి జిల్లాలు అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు ఎవరి వైపు మొగ్గు చూపించబోతున్నాయి.. ఎవరికి ఈ జిల్లాల ప్రజలు పట్టం గట్టబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
ఈ 34 నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి ఫేవర్ గా ఉంటే.. మరికొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఫేవర్ గా ఉన్నారు. ఓ 30 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై క్లారిటీ లేదు. ఓ 4 నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా అయితే టీడీపీ లేదా వైసీపీ గెలుస్తుందని సర్వేల ద్వారా తెలుస్తోంది. కానీ.. మిగితా ఆ 30 నియోజకవర్గాల్లో మాత్రం ఏ పార్టీ గెలుస్తుంది అనేది చెప్పలేకపోతున్నాయి సర్వేలు. 2014 లో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ.. 2019 ఎన్నికల్లో టీడీపీ చతికిలపడింది. మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీ పుంజుకుంటుందా? అనేది డౌటే అని చెప్పుకోవాలి.
ఈసారి టీడీపీ కూడా ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టింది. 2014 లాంటి రిజల్ట్స్ మళ్లీ రిపీట్ కావాలని భావిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తే టీడీపీ ఈసారి ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే అధికార వైసీపీ పార్టీని ఓడించి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ జెండా ఎగురవేస్తే రాష్ట్రంలో మిగితా నియోజకవర్గాల్లో కనీసం 50 నుంచి 60 సీట్ల వరకు గెలిచినా టీడీపీ ఈజీగా వచ్చే ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయనుంది.
Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam).…
Motorola Edge 50 : మోటోరోలా ఫోన్పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్రకటించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…
Women : మహిళలని ప్రోత్సహించేందుకు మోదీ సర్కారు అనేక పథకాలు తీసుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా…
Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…
Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్టడీగా సాగుతుంటాయి. ఆయన సినిమాల్లో స్టార్ హీరోలు,…
Watermelon : కొన్ని సీజనల్గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ…
Yoga Asanas : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్కు…
This website uses cookies.