
Guar : గోరు చిక్కుడు ఎంత పని చేసిందో తెలుసా..? ముగ్గురి ప్రాణాలు తీసింది..!
Guar : కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జులై 22న జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. గోరుచిక్కుడు కూర తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను రమేష్ (35), అతని కుమార్తెలు నాగమ్మ (8), దీప (6)గా గుర్తించారు. సోమవారం రాత్రి రమేష్ కుటుంబం గోరుచిక్కుడు కూర, అన్నం, రోటీ, సాంబార్ తినగా, మంగళవారం తెల్లవారు జామున వారు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రికి తరలించేలోపే ముగ్గురు మృతిచెందారు. భార్య పద్మావతి, ఇద్దరు పిల్లలు కృష్ణ (11), చైత్ర (10) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు…
Guar : గోరు చిక్కుడు ఎంత పని చేసిందో తెలుసా..? ముగ్గురి ప్రాణాలు తీసింది..!
ఈ సంఘటన సిర్వార్ తాలూకా కె. తిమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు రమేష్ నాయక్ తన పొలంలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఆదివారం పొలంలోని గోరుచిక్కుడు ఇంటికి తీసుకురావడంతో, సోమవారం ఆ కూర వండుకుని కుటుంబమంతా భోజనం చేశారు. అయితే పొలంలో కూరగాయలకు పురుగుల మందు పిచికారీ చేయడంతో, ఆ ప్రభావమే గోరుచిక్కుడు కాయలపై పడి ఉంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషాద ఘటనపై కవితల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇంతకుముందు కూడా జులై 16న కలబురగి జిల్లాలో ఇదే తరహా ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం తర్వాత ఒక ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్కు గురై అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడిన విద్యార్థులను గంగావర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. రాష్ట్రంలో తరచూ వంటకాల్లోని విషపూరిత పదార్థాల వల్ల ప్రజలు బాధపడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Dhurandhar 2 : ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2 సినిమా ఏ రేంజ్లో రచ్చ చేస్తోందో…
Supreme court : సుప్రీం కోర్టు ఇటీవల ఒక కీలకమైన కేసులో భార్యాభర్తల బంధం గురించి చాలా గొప్ప మాటలు…
Ration Card : రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడుతున్న…
Garikapati Narasimha Rao : ప్రవచనకర్తగా సమాజంలో ఎంతో గౌరవం ఉన్న గరికపాటి నరసింహారావు ఈ మధ్య తన నోటి…
Ysrcp : ఆంధ్రరాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. ముఖ్యంగా విశాఖపట్నం కార్పొరేషన్ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి.…
Indian : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్ వంటి…
Rain Alert : ఎండలు తీవ్రంగా మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంత ఉపశమనం లభించనున్నట్లు వాతావరణ శాఖ…
Ration Card : తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం…
KV School Jobs : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా కేంద్ర…
Vivo 5G Smartphone : భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో వివో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. స్టైలిష్…
PAN Card : కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియలో ముఖ్యమైన మార్పులను ప్రకటించింది. 2026–27 ఆర్థిక సంవత్సరాన్ని…
Gold Silver Price 21 March 2026 : బంగారం కొనాలనుకునే వారికి, పసిడి ప్రియులకు ఇది నిజంగా పండుగ…
This website uses cookies.