
Telangana Congress : గెలిచామని సంబురాలు చేసుకోవడం కాదు.. ముందుంది మొసళ్ల పండుగ.. కాంగ్రెస్కు తెలంగాణలో పాలన కత్తి మీద సామే..!
Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సింగిల్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రెండు సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం 40 సీట్లు కూడా సాధించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలవగా, బీఆర్ఎస్ 40 లోపే స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ 8 స్థానాలు సాధించింది. ఎంఐఎం పార్టీ ఇక ఎప్పటిలాగే 7 సీట్లు గెలుచుకుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పారు. గెలిపించి తీరారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ గెలుపు సాధించింది అంటే మామూలు విషయం కాదు. కాంగ్రెస్ ను వాళ్ల హామీలు గెలిపించాయా? లేక బీఆర్ఎస్ పై వ్యతిరేకత గెలిపించిందా? ఏంటి అనేది పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అసలు కథ మొదలవబోతోంది అనే విషయం చాలామందికి తెలియదు. అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతోంది. ఇల్లు అలకగానే పండుగ కాదు.. ముందుంది మొసళ్ల పండుగ అన్నట్టుగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ గెలవడం పక్కన పెడితే..
రేపటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తుంది అనేదే ఇప్పుడు పెద్ద చాలెంజింగ్ గా మారింది. ఎందుకంటే.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. చాలా సంక్షేమ పథకాలను ప్రారంభించింది. వాటిని కంటిన్యూ చేస్తోంది కూడా. అందులో రైతు బంధు, రుణ మాఫీ, దళిత బంధు, బీసీ బంధు లాంటి పథకాలు ఉన్నాయి. నిజానికి రైతు బంధు మొన్న నవంబర్ 28నే విడుదల కావాలి కానీ.. ఎన్నికల కోడ్ వల్ల విడుదల కాలేదు. రుణ మాఫీ కూడా ఎన్నికల కోడ్ వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముందు చేయాల్సిన పని రుణ మాఫీ చేయడం. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు ప్రతి ఎకరానికి రూ.15 వేలు రైతు బంధు డబ్బులు ఇవ్వడం. బీఆర్ఎస్ ప్రారంభించిన పథకాలు అన్నింటికీ నిధులు విడుదల చేయాలంటే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వేల కోట్లు కావాలి. ఇప్పుడు చూస్తే ప్రభుత్వ ఖజానాలో రూపాయి కూడా లేదు. అప్పులు కూడా కుప్పలుగా పడి ఉన్నాయి. రైతు రుణ మాఫీ కోసం నిధులు లేకనే బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలోనే ఆపేసింది. ఇంతలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. మరి.. కొత్తగా వచ్చిన ప్రభుత్వం వీటన్నింటినీ ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది తెలియదు.
తెలంగాణలో రెండు సార్లు అధికారం ఇచ్చాం బీఆర్ఎస్ కు. ఈ సారి ఒక్కసారి కాంగ్రెస్ కు చాన్స్ ఇస్తాం. వాళ్లు ఏం చేస్తారో చూస్తాం.. అని మాత్రమే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఒక చాన్స్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ కు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆచీతూచీ పాలన చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రకటించిన హామీలను కూడా అమలు చేయాలి. ముఖ్యంగా 6 గ్యారెంటీ హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అవి ఖచ్చితంగా కాంగ్రెస్ అమలు చేయాల్సిందే. మరి.. ఆ పథకాలను అమలు చేయాలంటే వేల కోట్ల నిధులు కావాలి. ఉన్నపళంగా అన్ని వేల కోట్ల నిధులను కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది.. అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
This website uses cookies.