Janasena : కాకినాడ కేంద్రంగా జనసేన రాజకీయం.. దెబ్బకు దెబ్బ కొట్టే ప్లాన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janasena : కాకినాడ కేంద్రంగా జనసేన రాజకీయం.. దెబ్బకు దెబ్బ కొట్టే ప్లాన్..!

Janasena  : ఏపీలో జనసేన బలమైన పార్టీ గా మారేందుకు శ్రాయశక్తులా కృషి చేస్తుంది. ఏపీలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన తమకు అధికారం ఇచ్చిన ప్రాలకు మంచి చేయాలని పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రత్యేకంగా కాకినాడ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలుస్తుంది. ముఖ్యంగా ద్వరంపూడు చంద్రశేఖర్ రెడ్డి మీద జనసేన రాజకీయ అస్త్రం వేయబోతుంది.కాకినాడ లో జరిగిన అవకతవకలు రైస్ నుంచి […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Janasena : కాకినాడ కేంద్రంగా జనసేన రాజకీయం.. దెబ్బకు దెబ్బ కొట్టే ప్లాన్..!

Janasena  : ఏపీలో జనసేన బలమైన పార్టీ గా మారేందుకు శ్రాయశక్తులా కృషి చేస్తుంది. ఏపీలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన తమకు అధికారం ఇచ్చిన ప్రాలకు మంచి చేయాలని పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రత్యేకంగా కాకినాడ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలుస్తుంది. ముఖ్యంగా ద్వరంపూడు చంద్రశేఖర్ రెడ్డి మీద జనసేన రాజకీయ అస్త్రం వేయబోతుంది.కాకినాడ లో జరిగిన అవకతవకలు రైస్ నుంచి పోర్ట్ వరకు ఎందులో చూసినా సరే గత ప్రభుత్వ అక్రమాలు బయటపడుతున్నాయి. ద్వారంపూడి ఆటలు కట్టించేలా జనసేన పూర్తి ఆధారలతో రిపోర్ట్ రెడీ చేస్తుంది. ఓ పక్క పవన్ కళ్యాణ్, మరోపక్క నాదెండ్ల మనోహర్ కూడా మంత్రిగా పూర్తిగా స్థాయిలో ప్రజలతో ఉంటూ వారి అవసరాలను తీర్చే ప్రయత్నాలను చేస్తున్నారు.

Janasena  కాకినాడతో క్లీనింగ్ మొదలు పెట్టిన జనసేన

కాకినాడ మీద జనసేన స్పెషల్ ఫోకస్ పెట్టడం వైసీపీ పార్టీ నేతలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒక్కో జిల్లాను తీసుకుని తమ మార్క్ అభివృద్ధి చేసి చూపించాలని జనసేన ప్రణాళిక చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓ పక్క సీఎం చంద్రబాబు కూడా జనసేనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రజాపాలన చేయాలని వారికి సురక్షితమైన పరిపాలన అందించాలని అనుకున్నాడో దాని కోసం కృషి చేస్తున్నారు. కాకినాడ నుంచి మొదలైన ఈ క్లీనింగ్ ప్రక్రియ రాష్ట్రమంతా జరుగుతుందని తెలుస్తుంది.

Janasena కాకినాడ కేంద్రంగా జనసేన రాజకీయం దెబ్బకు దెబ్బ కొట్టే ప్లాన్

Janasena : కాకినాడ కేంద్రంగా జనసేన రాజకీయం.. దెబ్బకు దెబ్బ కొట్టే ప్లాన్..!

వైసీపీ నాయకుల అక్రమం సంపాదన ప్రభుత్వ సొమ్ము ఎలా దారి మళ్లించారన్న దాని మీద డిప్యూటీ సీఎం అన్ని ఫైల్స్ తీక్షణంగా చూస్తున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన అక్రమాల గురించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. పవన్ మార్క్ పరిపాలన షురూ చేయగా దానికి కాకినాడ నుంచి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసినట్టు అర్ధమవుతుంది. ఇదే జోష్ తో మిగతా ఏరియాల్లో కూడా వైసీపీ నేతల అక్రమాలను బయట పెట్టి వారికి తగిన శిక్ష పడేలా చేసేలా చూస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది