Categories: Newspolitics

Kashmir Pahalgam Attack : జమ్మూను వీడుతున్న పర్యాటకులు

Kashmir Pahalgam Attack  : జమ్మూకశ్మీర్‌లో పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తరువాత రాష్ట్రంలో పర్యాటక వాతావరణం తీవ్రంగా దెబ్బతింది. పర్యాటకులు గంపెడాశలు పెట్టుకుని వచ్చినా, భయభ్రాంతులకు లోనై అక్కడినుంచి తమ నివాస ప్రాంతాలవైపు పయనమవుతున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిన నేపథ్యంలో, ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. మరోవైపు కొండచరియలు పడటంతో ప్రధాన రహదారి తాత్కాలికంగా మూసివేయబడింది. అందువల్ల పర్యాటకులు వేరే మార్గాలైన రైలు లేదా విమాన మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది.

Kashmir Pahalgam Attack : జమ్మూను వీడుతున్న పర్యాటకులు

ఈ దాడిలో మృతుల సంఖ్య 28కి చేరింది. అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. మృతులలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఒకరు నేపాల్‌కు చెందినవారు, మరొకరు యుఏఈ దేశానికి చెందినవారు. మృతదేహాలను నాలుగు ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు తరలిస్తున్నట్లు సమాచారం. నిన్న మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఆరుగురు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరిపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇది పర్యాటక ప్రాంతం కావడం వల్ల దాడి ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది.

పహల్గామ్ ఘటనపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘మధ్యాహ్నం సమయంలో ప్రజలు పరుగెత్తుకుంటూ వస్తుండటాన్ని చూశాం. తుపాకుల కాల్పుల గురించి తెలుసుకుని మేము కూడా అక్కడి నుంచి పారిపోయాం,’ అని గుల్జార్ అహ్మద్ అనే స్థానికుడు వెల్లడించారు. ‘ఇటువంటి ఘటనలతో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతింటోంది. ఇకపై పర్యాటకులు మళ్లీ వచ్చేందుకు సాహసించరేమో’ అన్నారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపుతూ, భద్రతాపై ప్రశ్నలు లేపుతోంది.

Recent Posts

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

47 minutes ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

2 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

3 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

4 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

6 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

6 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

9 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

10 hours ago