Kashmir Pahalgam Attack : జమ్మూను వీడుతున్న పర్యాటకులు
ప్రధానాంశాలు:
Kashmir Pahalgam Attack : జమ్మూను వీడుతున్న పర్యాటకులు
Kashmir Pahalgam Attack : జమ్మూకశ్మీర్లో పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తరువాత రాష్ట్రంలో పర్యాటక వాతావరణం తీవ్రంగా దెబ్బతింది. పర్యాటకులు గంపెడాశలు పెట్టుకుని వచ్చినా, భయభ్రాంతులకు లోనై అక్కడినుంచి తమ నివాస ప్రాంతాలవైపు పయనమవుతున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిన నేపథ్యంలో, ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. మరోవైపు కొండచరియలు పడటంతో ప్రధాన రహదారి తాత్కాలికంగా మూసివేయబడింది. అందువల్ల పర్యాటకులు వేరే మార్గాలైన రైలు లేదా విమాన మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది.

Kashmir Pahalgam Attack : జమ్మూను వీడుతున్న పర్యాటకులు
ఈ దాడిలో మృతుల సంఖ్య 28కి చేరింది. అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. మృతులలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఒకరు నేపాల్కు చెందినవారు, మరొకరు యుఏఈ దేశానికి చెందినవారు. మృతదేహాలను నాలుగు ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు తరలిస్తున్నట్లు సమాచారం. నిన్న మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఆరుగురు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరిపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇది పర్యాటక ప్రాంతం కావడం వల్ల దాడి ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది.
పహల్గామ్ ఘటనపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘మధ్యాహ్నం సమయంలో ప్రజలు పరుగెత్తుకుంటూ వస్తుండటాన్ని చూశాం. తుపాకుల కాల్పుల గురించి తెలుసుకుని మేము కూడా అక్కడి నుంచి పారిపోయాం,’ అని గుల్జార్ అహ్మద్ అనే స్థానికుడు వెల్లడించారు. ‘ఇటువంటి ఘటనలతో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతింటోంది. ఇకపై పర్యాటకులు మళ్లీ వచ్చేందుకు సాహసించరేమో’ అన్నారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్లోని పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపుతూ, భద్రతాపై ప్రశ్నలు లేపుతోంది.