KCR : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. అలా పోలింగ్ అయిపోయిందో లేదో ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. అయితే చాలావరకు ఎగ్జిట్ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసాయి. ఒకటి రెండు సంస్థలు మాత్రం భారత రాష్ట్ర సమితి గెలుస్తుందని చెప్పేసాయి. అయితే చాలావరకు ఎగ్జిట్ సంస్థలు వాస్తవానికి దగ్గరగానే సర్వే చేస్తుంటాయి. ఎలాగూ సర్వే సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడంతో బీఆర్ఎస్ క్యాడర్లో నిర్వేదం అలుముకుంది. కేటీఆర్ అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పటికి అది పెద్దగా ప్రయోజనం కలిగించలేదు. అంతేకాకుండా కేటీఆర్ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీరియస్ గా సమాధానం చెప్పారు. బీఆర్ఎస్ కచ్చితంగా ఓడిపోతుందని భారత రాష్ట్ర సమితి కార్యవర్గంలో ప్రముఖంగా వినిపిస్తుంది.
ఇక కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి లో కూడా పోటీ చేశారు. అయితే అక్కడి స్థానికుడైన వెంకటరమణ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు. అక్కడ ఆయన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డి లో ఓడిపోతారని తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం కేసీఆర్ అక్కడ రెండవ స్థానానికి పరిమితం కాబోతున్నారని తెలుస్తుంది. కేసీఆర్ తన రాజకీయ జీవితం ప్రారంభించిన తొలినాళ్ళలో మదన్మోహన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఓటమి అనేది తెలియకుండా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్స్ కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా డీలా పడిపోయారు.
ఇక కేసిఆర్ కామారెడ్డి తో పాటు గజ్వేల్ లో కూడా పోటీ చేశారు. ఇక్కడ కూడా కేసీఆర్ గెలిచే అవకాశం లేనట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్ గట్టి పోటీ ఇస్తున్నారు. అక్కడ జరిగిన పోలింగ్ విధానాన్ని బట్టి ఫలితం అనూహ్యంగా రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని సంస్థలు మాత్రం అక్కడ కేసీఆర్ స్వల్ప మెజారిటీతో గెలుస్తారని చెబుతున్నాయి. అయితే గజ్వేల్ లో సమస్యలు, మల్లన్న సాగర్ ముంపు బాధితుల ఇబ్బందులను ఈటల రాజేందర్ తెర పైకి తీసుకు రావడం లో సక్సెస్ అయ్యారు. పోల్ మేనేజ్మెంట్ లోను ఆయన చాకచక్యంగా వ్యవహరించారని తెలుస్తుంది. అందువల్ల గజ్వేల్ లో కూడా కేసీఆర్ కి గట్టి పోటీ ఏర్పడింది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం, మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో భారత రాష్ట్ర సమితి పూర్తిగా డీలా పడిపోయింది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.