KCR : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్నది. ఈ 20 ఏండ్లలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేసిన కార్యక్రమాలు, విజయాలను వివరించేందుకు వరంగల్ను విజయగర్జన సభను నిర్వహించేందుకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం మొదలుపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఇదిలా ఉండగా వచ్చే నెల 15న వరంగల్లో టీఆర్ఎస్ విజయగర్జన సభ నిర్వహించబోతున్న విషయం తెలిసినదే.
ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం కేసీఆర్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఇందులో అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విజయగర్జన సభకు ప్రజలను బస్సుల్లో తరలించే అంశం చర్చకు వచ్చింది. ఈ సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు కేసీఆర్ ఊహించని విధంగా ఓ ప్రశ్న అడిగారు. రాష్ట్రంలో ఎన్ని బస్సులు ఉన్నాయని పువ్వాడను సీఎం అడిగారు. ఇందుకు మంత్రి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారని సమాచారం. దీంతో సీఎం కాస్త అసహనానికి, ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. అదే సమయంలో అధికారులతో మాట్లాడి బస్సుల వివరాలు తెలుసుకునేందుకు మంత్రి పువ్వాడ సమావేశం నుంచి బయటకు వచ్చారు. అధికారులతో మాట్లాడి బస్సులు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే అసహనంతో ఉన్న సీఎం పువ్వాడ బస్సు వివరాలను తెలియజేయాలని చూసిన వాటిని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.
అనంతరం పువ్వాడ మాట్లాడుతూ తాను రవాణాశాఖ మంత్రిని అని ఆర్టీసీకి సంబంధించిన నిర్వహణ, బాధ్యతలను టీఎస్ఆర్టీసీ చైర్మన్ చూసుకుంటారని పువ్వాడ చెప్పడంతో అక్కడున్న వారు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మొత్తంగా సభకు సుమారు 22 వేల బస్సులను నడపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందుకు 10 లక్షల మంది హాజరవుతారు అని అంచనా వేస్తున్నారు. సభకు ప్రజలను తరలించడానికి, విజయవంతం చేయడానికి పలువురికి సీఎం బాధ్యతలు అప్పగించారని తెలుస్తున్నది. ఇందులో భాగంగానే స్థల పరిశీలన, సభ నిర్వహణ, ప్రజల తరలింపు, మాట్లాడే అంశాలు, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే విషయాలు, సవాళ్లను ఎదుర్కొనే తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.