kota srinivasa rao : నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ, నిద్ర నటించే వాడ్ని ఏం చేస్తామంటూ ఏపీ సీఎం జగన్ సంచలన కామెంట్స్ చేసిన కోటా…!
kota srinivasa rao.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ప్రస్తుతం బాగా వేడిగానే ఉన్నాయి. ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ గురించి చర్చ జరుగుతుండగా, తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నికపైన మొత్తం యంత్రంగాం పని చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై సీనియర్ నటుడు kota srinivasa rao తాజాగా పలు సంచలన కామెంట్స్ చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశారు కోటా. తెలంగాణ పరిస్థితి ఏపీతో పోల్చితే భిన్నంగా ఉందంటున్నారు కోటా. తెలంగాణ పరిస్థితి ఒలిచి పెట్టిన బనానాఅని పేర్కొన్నారు. ఇక్కడ అన్నీ సమకూరినట్లు తెలిపారు.
Kota Srinivas rao comments on ap cm YS jagan
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్లు, ఫ్లై ఓవర్స్, హైటెక్ సిటీ సకల సదుపాయాలున్నాయని చెప్పార. ఈ నేపథ్యంలోనే ఏపీ గురించి మాట్లాడారు కోటా. ఆంధ్రాలో ఏముంది?? ఆకులు పోగేసి విస్తరాకు కుట్టాలని, అక్కడ పరిస్థితి అలానే ఉందని చెప్పారు. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పనితీరుపై కామెంట్ చేయదల్చుకోలేదని పేర్కొంటూనే.. నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ, నిద్ర నటించే వాడ్ని ఏం చేస్తామంటూ సెటైర్ వేశారు కోటా. ఇకపోతే సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పొలిటీషియన్గానూ ఈయన పని చేశారు.
ap cm ys jagan list on mlc post vishakapatnam ysrcp
అప్పట్లో విజయవాడ రాజకీయాల్లో కోటాకు మంచి పేరుండగా, ఒకానొక దశలో చక్రం తిప్పారు. దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో 1999-2004 మధ్య కాలంలో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. కానీ, బీజేపీకి చెందన వ్యక్తిగానే ఉండిపోయారు.
Kota Srinivas rao comments on ap cm YS jagan
అయితే, నటనపరంగా తన ప్రవృత్తిని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సహాయనటుడిగా సినిమాల్లో పలు పాత్రలు పోషిస్తున్నారు కోటా శ్రీనివాసరావు. అప్పట్లో విలన్ రోల్స్ ప్లే చేసి విలక్షణతను చాటుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్-క్రిష్ కాంబోలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో కీలక పాత్రలో కోటా శ్రీనివాసరావు కనిపించబోతున్నారు.
