MLA Sambasivarao : ఈ అహంకాంర వ‌ల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది.. ఎమ్మెల్యే సాంబశివరావు సెన్సేషనల్ కామెంట్స్..!!

MLA Sambasivarao : ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ వాదనలను వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో మాట్లాడుతూ .. అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపాలి. ఈ సమావేశాలకు ప్రతిపక్షం సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు రావాల్సి ఉంది. బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా ముందుకు వెళ్లాలి. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూస్తామని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అనడం సరైనది కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు అని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సరైనది కాదు. స్వేచ్ఛ లేని జీవితాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించారు. స్వేచ్ఛ తెలంగాణ రావాలి.

పథకాల అమలులో విఫలమైన ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. పంజరం నుంచి బయటకు వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారు. 26 ప్రజాసంఘాలను గత ప్రభుత్వం నిషేధించింది. గత ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి, రెండు పడక గదుల ఇల్లు, దళిత బంధు, బీసీ బంధును విస్మరించింది. ప్రతి నెల ఒకటో తారీకున ఎందుకు జీతాలు ఇవ్వలేదు. విద్యార్థులకు ఉపకార వేతనాలు ఎందుకు ఇవ్వలేదు. బీఆర్ఎస్ తప్పులు చేయడం వల్ల అధికారం కోల్పోయింది అని సాంబశివరావు పేర్కొన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్న ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటాం. పాత ప్రభుత్వం చేసిన మంచి పనులు ఉంటాయి. వాటిని కొత్త ప్రభుత్వం కొనసాగించాలి.

వాళ్లు చేయలేని మంచి పనులను ప్రస్తుత గవర్నమెంటు చేయాలి. వారు చేసినటువంటి తప్పులను అర్థం చేసుకోవాలి. ఆ తప్పులను చేయకుండా ముందుకు వెళ్లాలి. ఏ ప్రభుత్వం సొంతంగా చేయదు ఉన్న వాటిని అభివృద్ధి చేసుకుంటూ వెళతారు. ఎంత మంచి ప్రభుత్వమైనా అనేక సంవత్సరాలు కొనసాగదు. ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో సాధారణం. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూస్తామని అనడం సరైనది కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. మహానుభావులకే ఓటమి తప్పలేదు. చంద్రబాబు ఓడిపోయారు. కేసీఆర్ ఓడిపోయారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు.

Share

Recent Posts

Pakistani : పాకిస్థాన్ గూఢచారిని అరెస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ…!

Pakistani  : పహల్గాం ఉగ్రదాడి తర్వాత Pak - India భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న తరుణంలో…

3 hours ago

Mahesh Babu Actress : పెళ్లే కాలేదు.. మ‌హేష్ హీరోయిన్ త‌ల్లి ఎలా అవుతుంది?

బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…

4 hours ago

Rashmi Gautam Sudheer : సుధీర్‌తో గొడ‌వ‌ల విష‌యంలో కార‌ణం చెప్పిన ర‌ష్మీ గౌత‌మ్

Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంట‌ల‌లో సుధీర్-ర‌ష్మీ గౌత‌మ్ జంట ఒక‌టి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…

5 hours ago

Prabha Heroine : నువ్వు వర్జినేనా .. ప్రభాస్ హీరోయిన్ కు దారుణమైన ప్రశ్న ..!

Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో…

6 hours ago

Caste Survey : కులగణన సర్వేలో మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అంతే సంగతి..!

Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…

8 hours ago

Anil Kumar Yadav : నేను ఎక్కడికీ పారిపోలేదు – వైసీపీ లీడర్ క్లారిటీ..!

Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…

9 hours ago

Feeding Cows : ఆవులకు ఆహారం తినిపించ‌డం వల్ల కలిగే జ్యోతిషశాస్త్ర ప్రయోజనాలు ?

Feeding Cows  : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…

10 hours ago

Jio : జియోలో అదిరిపోయే ఆఫ‌ర్..రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..!

Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా త‌క్కువే అని చెప్పాలి. జియో…

11 hours ago