Nagababu : మరోసారి మంత్రి రోజాపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ ..!

Advertisement
Advertisement

Nagababu : జనసేన పార్టీ నేత నాగబాబు శనివారం తెనాలి నియోజకవర్గం జన సైనికులు వీర మహిళల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన వచ్చేతరాల కోసం పెట్టిన పార్టీ అని అన్నారు. ఎన్నికలలో వెంటనే గెలవాలని పెట్టిన పార్టీ కాదని వ్యాఖ్యానించారు.గత పది సంవత్సరాల నుంచి జయపజయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నామని అన్నారు. సాధారణంగా ఓడిపోతే జనాలు ఆ నాయకుడిని పట్టించుకోరు. కానీ ఓడిపోయే కొద్ది బలపడుతున్న రాజకీయ నేత పవన్ కళ్యాణ్ అని నాగబాబు అన్నారు. రాజకీయాలలో మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీలో పరాజయాలు ఎదురైనా తర్వాత సినిమాకి పవన్ బిజినెస్ పెరగటం అతడి స్టామినాని నిరూపిస్తోంది. దానికి కారణం పవన్ మానవత్వానికి కనెక్ట్ అయిపోయారు అని అన్నారు.

Advertisement

ఇక జనసేన, టీడీపీ తో పొత్తు పెట్టుకోవడానికి కారణం కూడా వివరించారు. ఒకప్పుడు నేను కూడా చంద్రబాబును విమర్శించాను కానీ ఆయన ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేదు. వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఎటువంటి ఆటంకం కలిగించలేదు. కానీ టీడీపీ చేసే కార్యక్రమాలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబును పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఇలాంటి నాయకుడిని ఎదుర్కోవాలంటే జనసేన, టీడీపీ తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలు ఎక్కువైపోయాయి. మరోసారి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 50% జనాభా ఖాళీ అయిపోతుందని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నాగబాబు అన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వ వచ్చాక సంక్షేమం అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. ఇకపోతే వై.యస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం పక్కన పెడుతున్నారు. ఆస్థానంలో కొత్త ఇన్చార్జిలను నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వైసీపీ రెండు లిస్టులను విడుదల చేసింది. అందులో 38 మంది కొత్త ఇన్చార్జిలను ఏర్పాటు చేసింది. మరో కొద్ది రోజుల్లో మూడో లిస్ట్ కూడా రాబోతుంది. అందులో మంత్రి రోజా సీటు చిరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.