
Nagababu : మరోసారి మంత్రి రోజాపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ ..!
Nagababu : జనసేన పార్టీ నేత నాగబాబు శనివారం తెనాలి నియోజకవర్గం జన సైనికులు వీర మహిళల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన వచ్చేతరాల కోసం పెట్టిన పార్టీ అని అన్నారు. ఎన్నికలలో వెంటనే గెలవాలని పెట్టిన పార్టీ కాదని వ్యాఖ్యానించారు.గత పది సంవత్సరాల నుంచి జయపజయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నామని అన్నారు. సాధారణంగా ఓడిపోతే జనాలు ఆ నాయకుడిని పట్టించుకోరు. కానీ ఓడిపోయే కొద్ది బలపడుతున్న రాజకీయ నేత పవన్ కళ్యాణ్ అని నాగబాబు అన్నారు. రాజకీయాలలో మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీలో పరాజయాలు ఎదురైనా తర్వాత సినిమాకి పవన్ బిజినెస్ పెరగటం అతడి స్టామినాని నిరూపిస్తోంది. దానికి కారణం పవన్ మానవత్వానికి కనెక్ట్ అయిపోయారు అని అన్నారు.
ఇక జనసేన, టీడీపీ తో పొత్తు పెట్టుకోవడానికి కారణం కూడా వివరించారు. ఒకప్పుడు నేను కూడా చంద్రబాబును విమర్శించాను కానీ ఆయన ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేదు. వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఎటువంటి ఆటంకం కలిగించలేదు. కానీ టీడీపీ చేసే కార్యక్రమాలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబును పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఇలాంటి నాయకుడిని ఎదుర్కోవాలంటే జనసేన, టీడీపీ తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలు ఎక్కువైపోయాయి. మరోసారి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 50% జనాభా ఖాళీ అయిపోతుందని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నాగబాబు అన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వ వచ్చాక సంక్షేమం అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. ఇకపోతే వై.యస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం పక్కన పెడుతున్నారు. ఆస్థానంలో కొత్త ఇన్చార్జిలను నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వైసీపీ రెండు లిస్టులను విడుదల చేసింది. అందులో 38 మంది కొత్త ఇన్చార్జిలను ఏర్పాటు చేసింది. మరో కొద్ది రోజుల్లో మూడో లిస్ట్ కూడా రాబోతుంది. అందులో మంత్రి రోజా సీటు చిరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
This website uses cookies.