Nagababu : పెద్దిరెడ్డి, జగన్, ద్వారపూడి.. ఎవరిని వదలకుండా విమర్శలు కురిపించిన నాగబాబు
Nagababu : జనసేన అగ్రనేత నాగబాబు ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన పెద్దిరెడ్డి నుండి ద్వారపూడి వరకు అందరిని విమర్శిస్తూ విమర్శలు సంధించాడు. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు.అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆరోపించారు. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని విమర్శించారు. అసెంబ్లీకి రాని పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో చెరువులు ఆక్రమించారని ఆరోపించారు.
Nagababu : పెద్దిరెడ్డి, జగన్, ద్వారపూడి.. ఎవరిని వదలకుండా విమర్శలు కురిపించిన నాగబాబు
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం సోమల దగ్గర ‘‘జనంలోకి జనసేన’’ పేరిట జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించిన సమయంలో నాగబాబు ఈ విమర్శలు చేశారు. . ఈ సభలో నాగబాబు పాల్గొని వైసీపీ, పెద్దిరెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతి చేసిన వైసీపీ నేతలను జైలుకు పంపిస్తామని నాగబాబు హెచ్చరించారు. వైసీపీ ఖాళీ అయిపోతోంది.. వచ్చే ఎన్నికల్లోపు వైసీపీలో ఎవరూ ఉండరని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ అందరూ పెద్దిరెడ్డికి భయపడతారు… మీరు కూడా జాగ్రత్త అని కొందరు చెప్పారని నాగబాబు వెల్లడించారు. అయితే… పెద్దిరెడ్డి కాదు… ఇంకే రెడ్డి వచ్చినా తాము భయపడబోమని చెప్పానని తెలిపారు.
“పెద్దిరెడ్డికే కాదు… వాళ్ల నాయకుడు జగన్ కు, జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డికే భయపడలేదు… ఇతనెంత! మేం న్యాయంగా, ధర్మంగా ముందుకెళ్లే పవన్ కల్యాణ్ నాయకత్వంలో పనిచేస్తున్నాం… మాకు పెద్దిరెడ్డి కాదు కదా… సుబ్బారెడ్డి, మరో పిచ్చిరెడ్డి వచ్చినా భయపడేది లేదు” అని నాగబాబు స్పష్టం చేశారు. శాసనసభ చుట్టుపక్కలకు రావడానికి కూడా వైసీపీ నేతలకు ధైర్యం సరిపోవడంలేదని నాగబాబు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడంలేదని వైసీపీ నేతలు అంటున్నారని, సభకు వస్తే కదా మైక్ ఇచ్చేది లేనిదీ తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చి గొంతుక వినిపించాలని ఈ సందర్భంగా జగన్ రెడ్డికి కూడా చెబుతున్నానని అన్నారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం మానుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు చూడాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం రాకతో దాదాపు 20 ప్రముఖ కంపెనీలు రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయని, తద్వారా 4 లక్షల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు.
Chickpeas : ఆరోగ్యకరమైన పప్పులు మనకి అందుబాటులో ఎన్నో ఉన్నాయి. అందులో పచ్చి వేరు శనగలు కూడా ఒకటి. వేరుశనగలను…
Fruit Soft Drink : నానాటికి భారత దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల కేసులు వేగంగా పెరగడం మనం చూస్తూనే ఉన్నాం.…
Milk Rice Eating : మన పూర్వికులు ఎక్కువగా అన్నంలో పాలను కలుపుకొని తింటూ ఉండేవారు. ఇప్పుడు ఎక్కువగా పాలకు…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 500 సంవత్సరాల తర్వాత ఈ రాశుల వారికి మహా సంయోగం ఎక్కడభోతుంది.2025, జూన్…
Jio Electric Scooters : టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో సంస్థ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టింది.…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ Telangana Govt రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం…
Drishyam Movie Repeat : ఈ రోజుల్లో మహిళలు ముదిరిపోతున్నారు. వివాహేతర సంబంధాల కోసం పండంటి సంసారం నాశనం చేసుకుంటున్నారు.…
Ramya Krishna : సౌత్ సినీ పరిశ్రమలో కొన్నాళ్ల కితం వరకు ఒక పవర్ఫుల్ హీరో పాత్రని ఢీ కొట్టాలంటే…
This website uses cookies.