
Nagababu : పెద్దిరెడ్డి, జగన్, ద్వారపూడి.. ఎవరిని వదలకుండా విమర్శలు కురిపించిన నాగబాబు
Nagababu : జనసేన అగ్రనేత నాగబాబు ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన పెద్దిరెడ్డి నుండి ద్వారపూడి వరకు అందరిని విమర్శిస్తూ విమర్శలు సంధించాడు. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు.అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆరోపించారు. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని విమర్శించారు. అసెంబ్లీకి రాని పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో చెరువులు ఆక్రమించారని ఆరోపించారు.
Nagababu : పెద్దిరెడ్డి, జగన్, ద్వారపూడి.. ఎవరిని వదలకుండా విమర్శలు కురిపించిన నాగబాబు
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం సోమల దగ్గర ‘‘జనంలోకి జనసేన’’ పేరిట జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించిన సమయంలో నాగబాబు ఈ విమర్శలు చేశారు. . ఈ సభలో నాగబాబు పాల్గొని వైసీపీ, పెద్దిరెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతి చేసిన వైసీపీ నేతలను జైలుకు పంపిస్తామని నాగబాబు హెచ్చరించారు. వైసీపీ ఖాళీ అయిపోతోంది.. వచ్చే ఎన్నికల్లోపు వైసీపీలో ఎవరూ ఉండరని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ అందరూ పెద్దిరెడ్డికి భయపడతారు… మీరు కూడా జాగ్రత్త అని కొందరు చెప్పారని నాగబాబు వెల్లడించారు. అయితే… పెద్దిరెడ్డి కాదు… ఇంకే రెడ్డి వచ్చినా తాము భయపడబోమని చెప్పానని తెలిపారు.
“పెద్దిరెడ్డికే కాదు… వాళ్ల నాయకుడు జగన్ కు, జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డికే భయపడలేదు… ఇతనెంత! మేం న్యాయంగా, ధర్మంగా ముందుకెళ్లే పవన్ కల్యాణ్ నాయకత్వంలో పనిచేస్తున్నాం… మాకు పెద్దిరెడ్డి కాదు కదా… సుబ్బారెడ్డి, మరో పిచ్చిరెడ్డి వచ్చినా భయపడేది లేదు” అని నాగబాబు స్పష్టం చేశారు. శాసనసభ చుట్టుపక్కలకు రావడానికి కూడా వైసీపీ నేతలకు ధైర్యం సరిపోవడంలేదని నాగబాబు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడంలేదని వైసీపీ నేతలు అంటున్నారని, సభకు వస్తే కదా మైక్ ఇచ్చేది లేనిదీ తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చి గొంతుక వినిపించాలని ఈ సందర్భంగా జగన్ రెడ్డికి కూడా చెబుతున్నానని అన్నారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం మానుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు చూడాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం రాకతో దాదాపు 20 ప్రముఖ కంపెనీలు రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయని, తద్వారా 4 లక్షల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.