Categories: Newspolitics

Nagababu : పెద్దిరెడ్డి, జ‌గ‌న్, ద్వారపూడి.. ఎవ‌రిని వ‌ద‌ల‌కుండా విమ‌ర్శ‌లు కురిపించిన నాగ‌బాబు

Advertisement
Advertisement

Nagababu : జనసేన అగ్రనేత నాగబాబు ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయ‌న పెద్దిరెడ్డి నుండి ద్వార‌పూడి వ‌ర‌కు అంద‌రిని విమ‌ర్శిస్తూ విమ‌ర్శ‌లు సంధించాడు. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు.అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆరోపించారు. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని విమర్శించారు. అసెంబ్లీకి రాని పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో చెరువులు ఆక్రమించారని ఆరోపించారు.

Advertisement

Nagababu : పెద్దిరెడ్డి, జ‌గ‌న్, ద్వారపూడి.. ఎవ‌రిని వ‌ద‌ల‌కుండా విమ‌ర్శ‌లు కురిపించిన నాగ‌బాబు

Nagababu గ‌ట్టిగా ఇచ్చి ప‌డేశాడు..

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం సోమల దగ్గర ‘‘జనంలోకి జనసేన’’ పేరిట జనసేన భారీ బహిరంగ సభ నిర్వ‌హించిన స‌మ‌యంలో నాగ‌బాబు ఈ విమ‌ర్శ‌లు చేశారు. . ఈ సభలో నాగబాబు పాల్గొని వైసీపీ, పెద్దిరెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతి చేసిన వైసీపీ నేతలను జైలుకు పంపిస్తామని నాగబాబు హెచ్చరించారు. వైసీపీ ఖాళీ అయిపోతోంది.. వచ్చే ఎన్నికల్లోపు వైసీపీలో ఎవరూ ఉండరని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ అందరూ పెద్దిరెడ్డికి భయపడతారు… మీరు కూడా జాగ్రత్త అని కొందరు చెప్పారని నాగబాబు వెల్లడించారు. అయితే… పెద్దిరెడ్డి కాదు… ఇంకే రెడ్డి వచ్చినా తాము భయపడబోమని చెప్పానని తెలిపారు.

Advertisement

“పెద్దిరెడ్డికే కాదు… వాళ్ల నాయకుడు జగన్ కు, జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డికే భయపడలేదు… ఇతనెంత! మేం న్యాయంగా, ధర్మంగా ముందుకెళ్లే పవన్ కల్యాణ్ నాయకత్వంలో పనిచేస్తున్నాం… మాకు పెద్దిరెడ్డి కాదు కదా… సుబ్బారెడ్డి, మరో పిచ్చిరెడ్డి వచ్చినా భయపడేది లేదు” అని నాగబాబు స్పష్టం చేశారు. శాసనసభ చుట్టుపక్కలకు రావడానికి కూడా వైసీపీ నేతలకు ధైర్యం సరిపోవడంలేదని నాగబాబు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడంలేదని వైసీపీ నేతలు అంటున్నారని, సభకు వస్తే కదా మైక్ ఇచ్చేది లేనిదీ తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చి గొంతుక వినిపించాలని ఈ సందర్భంగా జగన్ రెడ్డికి కూడా చెబుతున్నానని అన్నారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం మానుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు చూడాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం రాకతో దాదాపు 20 ప్రముఖ కంపెనీలు రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయని, తద్వారా 4 లక్షల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు.

Advertisement

Recent Posts

Nirmala Sitharaman : రైతుల కోసం ‘ధన్ ధాన్య కృషి’ పథకాన్ని ప్రకటించిన నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman  : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman రైతుల కోసం 'ధన్ ధాన్య కృషి' పథకాన్ని…

8 minutes ago

Monalisa Bhosle : పుష్ప 2 పోస్టర్ ముందు మోనాలిసా ఫోజులు.. హీరోయిన్ అవ్వగానే లుక్కు మార్చేసిందిగా..!

Monalisa Bhosle : మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మోనాలిసా వైరల్ అయిన…

1 hour ago

Telangana Congress : టి. కాంగ్రెస్ ప‌ట్టు త‌ప్పిందా.. అధికారంలోకి వ‌చ్చాక రేవంత్ రెడ్డికి ఏమైంది..!

Telangana Congress : తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వ‌చ్చింది. అధికారం కోసం రేవంత్ రెడ్డి…

2 hours ago

Property Rights : అల్లుడికి మామ ఆస్తిపై హక్కులు?.. హైకోర్టు తీర్పు

Property Rights : మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక ఆస్తి వివాద కేసులో తన ఉత్తర్వులో, 'తల్లిదండ్రుల పోషణ చట్టం ప్రకారం,…

4 hours ago

Abhishek Sharma : మ‌రో యువ‌రాజ్ మ‌న‌కు దొరికిన‌ట్టేనా.?

Abhishek Sharma : అభిషేక్ శ‌ర్మ‌.. ఈ పేరు ఇప్పుడు నెట్టింట మారుమ్రోగిపోతుంది. నిన్న రాత్రి ఇంగ్లండ్‌తో జ‌రిగిన టీ20లో…

5 hours ago

BRS : కేసీఆర్ మౌనం.. కేటీఆర్, హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు…?

BRS : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన ఏడాది దాటింది. పార్టీపై పట్టు సాధించడానికి పార్టీ అధ్యక్షుడు కె.…

6 hours ago

M Rajitha Parmeshwar Reddy : ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భగాయతులో 5 ఎకరాల భూమి

M Rajitha Parmeshwar Reddy : రజితాపరమేశ్వర్ రెడ్డి M Rajitha Parmeshwar Reddy  విజ్ఞప్తిపై స్పందించి మంత్రి శ్రీధర్…

7 hours ago

Prabhas : కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ వచ్చేసింది.. రుద్ర పాత్ర లుక్ అదిరింది..!

Prabhas : మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా Kannappa Movie లో మన రెబల్ స్టార్ ప్రభాస్…

7 hours ago