
nara lokesh and prashanth kishore travelled in same flight
Prashanth Kishore : పీకే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పీకే అన్నా ప్రశాంత్ కిషోర్ అన్నా ఒక్కటే. 2014 లో బీజేపీ గెలుపులో పీకే టీమ్ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్.. ఏపీలో వైసీపీ కోసం పని చేసింది. వాళ్లు వేసిన స్ట్రాటజీలు, వ్యూహాలు ఫలించాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. నిజానికి.. ఈ మధ్య రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలను పెట్టుకొని వాళ్లతో వ్యూహాలు రచించుకోవడం, అలాగే సొంత సర్వేలు నిర్వహించుకోవడం పరిపాటి అయింది. వైసీపీతో పీకే టీమ్ పని చేసినట్టుగానే.. టీడీపీతో కూడా రాబిన్ శర్మ టీమ్ వర్క్ చేస్తోంది. కానీ.. పీకే టీమ్ అంత సమర్థవంతంగా రాబిన్ శర్మ పని చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గం వ్యాప్తంగా రాబిన్ శర్మ టీమ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారు. ఆ సర్వేల ఆధారంగానే ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్లు కూడా కేటాయించనున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల కంటే ముందు కొన్ని రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ కోసం పీకే టీమ్ పని చేసింది. ఆ తర్వాత మధ్యలో ఆ డీల్ ను ఉపసంహరించుకుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ కు నెగెటివిటీ పెరుగుతోందని మళ్లీ కేసీఆర్ పీకేను రంగంలోకి దింపినప్పటికీ పీకే.. బీఆర్ఎస్ తో పని చేయడానికి ఒప్పుకోలేదు.
కట్ చేస్తే తాజాగా టీడీపీ యువనేత నారా లోకేష్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ ఒకే విమానంలో ప్రయాణించారు. అది కూడా ప్రైవేట్ విమానం. ఇద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒకే విమానంలో రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయమే ఉంది. ఈనేపథ్యంలో పీకే, నారా లోకేష్ ఇద్దరూ కలిసి ఒకే విమానంలో కలిసి ప్రయాణించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కోసం పీకే టీమ్ పని చేయబోతుందా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిజానికి ఈసారి ఎలాగైనా గెలవాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. టీడీపీ గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం టీడీపీకి అనుకూల వాతావరణమే ఉంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యతిరేకత.. టీడీపీకి కలిసి రానుంది. అలాగే పీకే టీమ్ ను కూడా కలుపుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే.. పీకే టీమ్ టీడీపీ గెలుపు కోసం పని చేయబోతున్నదని.. వీళ్లిద్దరి కలయికతో అర్థం అవుతోంది. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కు చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ప్రైవేట్ జెట్ లో నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. ప్రయాణంలో ఇద్దరూ కలిసి ఏం మాట్లాడారో తెలియదు కానీ.. పీకే టీమ్ మాత్రం టీడీపీ కోసం పని చేయబోతున్నట్టు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. పీకే టీమ్ తో టీడీపీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. బీజేపీ కూడా త్వరలో వీళ్లతో పాటు కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో పీకే టీమ్ కూడా ఈ కూటమికి తోడైతే ఇక వైసీపీని ఓడించి సులభంగా ఏపీలో అధికారాన్ని ఛేజిక్కించుకోవచ్చనేది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే.. పీకే టీమ్ తో చర్చించడం కోసమే.. లోకేష్, పీకే.. విజయవాడకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. పీకే టీమ్ టీడీపీ కోసం పని చేస్తే టీడీపీకి చాలా ప్లస్ అవుతుంది. గెలిచే అవకాశాలు ఇంకాస్త పెరుగుతాయి. అయితే.. 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పీకే టీమ్ పని చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పీకే టీమ్ పెద్దగా సీఎం జగన్ తో టచ్ లో లేదు. మళ్లీ ఈసారి ఎన్నికల కోసం మరి జగన్.. పీకే టీమ్ ను కాంటాక్ట్ కాలేదా? వాళ్ల కాంట్రాక్ట్ పూర్తయిందా? మళ్లీ 2024 ఎన్నికల్లో తమతో పని చేయాలని జగన్ ఒప్పందం కుదుర్చుకోలేదా? అందుకే ఈసారి టీడీపీతో కలిసి పీకే టీమ్ పని చేయబోతోందా? అనేదానిపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.