
nara lokesh strong reply to ys jagan
Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిన విషయం గురించే చర్చలు నడుస్తున్నాయి. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిం 52 రోజులు రాజమండ్రి జైలులో పెట్టారు. దానిపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలని చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు సాగిస్తోందని అంటున్నారు. తాజాగా నారా లోకేష్.. చంద్రబాబు విషయంపై రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈరోజు టీడీపీ బృందం గవర్నర్ గారిని కలిశాం. గవర్నర్ గారికి చాలా స్పష్టంగా జగన్ లో నరనరాన కక్ష సాధింపు తప్ప ఏం లేదని స్పష్టంగా ఆధారాలతో సహా చూపించాం. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలపై ఆయన కక్ష సాధింపు ఎలా చేస్తున్నారో, ఎలా అచ్చెన్నాయుడు కానీ.. కొల్లు రవీంద్రా కానీ.. నరేంద్ర కానీ ఏం తప్పు చేయకపోయినా 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు జైలుకు ఎలా పంపించారో గవర్నర్ కి చెప్పాం అన్నారు.
తాడిపత్రిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపైన ఎలా 100 కేసులు పెట్టి నిన్న మొన్న కూడా ఒక కేసు పెట్టి వేధిస్తున్నారని చెప్పాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 260 కేసులు టీడీపీ సీనియర్ నాయకులపై ఎలా పెట్టారో కూడా వివరాలతో సహా మేము గవర్నర్ కు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై 60 వేల కేసులు ఎలా పెట్టారో కూడా గవర్నర్ కు చూపించడం జరిగింది. నేను యువగళం పాదయాత్ర చేసినప్పుడు నాపై, నాయకులపై, వాలంటీర్లపైన ఎలా కేసులు బనాయించారో గవర్నర్ కు చెప్పాం. ఇంకో పక్క దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడుపై దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయినా 17 ఏ పర్మిషన్ లేకపోయినా ఆయన్ను ఎలా సతాయించారు.. ఎలా జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించారో కూడా గవర్నర్ కు వివరించాం అని లోకేష్ చెప్పారు.
చాలా స్పష్టంగా రూ.3 వేల కోట్ల అవినీతి అని చెప్పారు. ఆ తర్వాత 370 కోట్ల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల అవినీతి అని చెప్పారు. అది కూడా పార్టీ అకౌంట్లో ఎక్కడో డబ్బులు పడ్డాయని చెప్పి ఎలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడును ఇబ్బంది పెట్టిందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు ఎలా అడ్డుపడ్డారో కూడా చెప్పాం. ప్రజలపై కూడా ముఖ్యమంత్రి ఎలా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో చెప్పాం. అమర్ నాథ్ గౌడ్ గురించి కూడా దృష్టికి తీసుకెళ్లాం. శ్యామ్ కుమార్ దళిత యువకుడిపై వైసీపీ నాయకులు ఎలా ప్రవర్తించారో చెప్పాం. పదో తరగతి పాపకు టీసీ ఇచ్చి పంపించారు. దీంతో ఆ పాప ఆత్మహత్య చేసుకుంది. వైసీపీ నేత కూతురుకు రెండో ర్యాంక్ వస్తుందని ఆ పాపకు టీసీ ఇచ్చి పంపిస్తే ఆ అమ్మాయి లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. వైసీపీ నేతలు ఎలాంటి దారుణాలు చేశారో ఆయన దృష్టికి తీసుకెళ్లాం అని నారా లోకేష్ స్పష్టం చేశారు.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.