nimmagadda ramesh
Nimmagadda Ramesh : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రస్తుతం ఉన్న అధికారులు మొత్తం కూడా సలాం కొడుతూ ఆయన ఆదేశాల అనుసారంగా పని చేస్తుంటే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ మాత్రం తిరుగుబాటు చేశాడు. జగన్ కావాలన్నప్పుడు వద్దని.. వద్దనుకున్నప్పుడు కావాల్సిందే అంటూ ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ నిర్వహించాడు. గత ఏడాది మార్చిలో ఎన్నికలను అర్థాంతరంగా ఆపేయడం వల్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా ఫీల్ అయ్యాడు. కనీసం ప్రభుత్వంలో ఉన్న తమకు సమాచారం ఇవ్వాలి కాదా సీఎం అయిన తాను కూడా మీడియా ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా ఆగ్రహంతో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన్ను పీకి పారేశాడు. అయితే కోర్టుకు వెళ్లి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పోరాడి మరీ మళ్లీ తన పదవిని తెచ్చుకున్నాడు.
నిమ్మగడ్డ రమేష్ అనుకున్నది అనుకున్నట్లుగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాడు. ఏకగ్రీవం చేసేందుకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తూ ఉంటే వారిని అడ్డుకున్నాడు. కోర్టులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు పదే పదే మొట్టికాయలు పడేలా నిమ్మగడ్డ రమేష్ చేశాడు. అందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనపై చాలా కోపంగా ఉండి ఉంటారు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైనే కాకుండా మంత్రులపై కూడా నిమ్మగడ్డ ప్రతాపం చూపించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి మరియు బొత్సాలపై తన పవర్ ను ఉపయోగించి ఆంక్షలు విధించాడు. ఒక ఎమ్మెల్యే పై ఆంక్షలు విధించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కు రుచి చూపించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు.
nimmagadda ramesh
అసెంబ్లీ స్పీకర్ కు తమ సభా హక్కులకు భంగం కలిగించేలా నిమ్మగడ్డ రమేష్ వ్యవహరించాడంటూ ఫిర్యాదు ఇచ్చారు. స్పీకర్ ఖచ్చితంగా నిమ్మగడ్డ పై చర్యలు తీసుకోవడం ఖాయం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల కోసం స్పీకర్ వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు నిమ్మగడ్డ హాజరు అవ్వాల్సిందిగా నోటీసులు అందాయి. దాంతో ఆయన పై తప్పు తేలడం ఖాయం అలాగే జైలుకు వెళ్లడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పెట్టుకుంటే నిమ్మగడ్డ రమేష్ విషయంతో తేట తెల్లం అవుతుంది అంటూ వైకాపా నాయకులు అంటున్నారు.
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
This website uses cookies.