India Pakistan : S-400 ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం : కల్నల్ సోఫియా ఖురేషి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

India Pakistan : S-400 ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం : కల్నల్ సోఫియా ఖురేషి

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :10 May 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  India Pakistan : S-400 ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం : కల్నల్ సోఫియా ఖురేషి

India Pakistan : భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత నాలుగో రోజు కూడా పాకిస్థాన్‌ దుశ్చర్యలకు పాల్పోడుతుంది. భారత్​ దీటుగానే బదులిస్తోంది. ప్రసిద్ధ క్షేత్రాలు లక్ష్యంగా పాకిస్థాన్​ దాడులు చేస్తోంది, ప్రసిద్ధ శంభూ ఆలయం లక్ష్యంగా పాక్‌ దాడులు చేసింది, జమ్ములోని జనావాసాలపైనా పాక్‌ దాడులు చేసింది అని ర‌క్ష‌ణ శాఖ తెలియ‌జేసింది. S- 400 ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసింది అని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.

India Pakistan S 400 ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం కల్నల్ సోఫియా ఖురేషి

India Pakistan : S-400 ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం : కల్నల్ సోఫియా ఖురేషి

India Pakistan త‌ప్పుడు ప్ర‌చారాలు..

పాకిస్థాన్ రెచ్చగొడుతూ దాడులు కొనసాగిస్తూనే ఉంది. 24 చోట్ల ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించింది. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై భారత్ ప్రతిదాడులు చేసింది. S-400ను ధ్వంసం చేశామంటూ పాక్ తప్పుడు ప్రచారం చేస్తుంద‌ని కల్నల్ సోఫియా ఖురేషి స్ప‌ష్టం చేశారు.

పాకిస్థాన్‌లోని 4 ఎయిర్‌బేస్‌లపై మనం డ్రోన్‌ దాడులు చేశాం, పాకిస్థాన్‌కు చెందిన ఏడీ రాడార్‌ను డ్రోన్లు ధ్వంసం చేశాయి అని సోఫియా ఖురేషి అన్నారు. పాకిస్థాన్ సైనిక బలగాలు ముందుకు వస్తున్నట్లు గమనించాం. పాకిస్థాన్‌ తన అసత్య ప్రచారాలను కొనసాగిస్తోంది. భారత్‌లోని పలు ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు పాక్‌ చేస్తున్న ప్రచారం అవాస్తవం. పాక్‌ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో తిప్పికొట్టారు భార‌త సైన్యాధికారులు.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది