
jamili elections
Modi : జమిలి ఎన్నికల అంశాన్ని మోదీ సర్కార్ వదిలిపెట్టటం లేదు. లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ, మోదీ ప్రభుత్వం చాలారోజులుగా ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ ప్రతిపాదనకు పార్లమెంటరీ స్థాయీసంఘం మద్దతు కూడా లభించింది. జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని, రాజకీయ పార్టీల వ్యయం కూడా దిగివస్తుందని , కాబట్టి, వాటిని నిర్వహించటం మంచిదేనని పేర్కొంటూ నివేదికను సమర్పించింది.
కేంద్ర సిబ్బంది, న్యాయశాఖలకు సంబంధించి ఏర్పాటైన స్థాయీసంఘం ఈ నివేదికను రూపొందించింది. దీనిని మంగళవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జమిలి ఎన్నికల వల్ల మానవ వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు వీలవుతుందని నివేదికలో స్థాయీసంఘం పేర్కొన్నది. తరచూ జరిగే ఎన్నికలతో ప్రజల్లో ఏర్పడిన అనాసక్తిని జమిలి ఎన్నికలతో తగ్గించవచ్చని, తద్వారా ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం కూడా పెరుగుతుందని అభిప్రాయపడింది.
దేశంలో జమిలి ఎన్నికలు కొత్తకాదని, తొలి మూడు సార్వత్రిక ఎన్నికలు (1952, 57, 62) జమిలి పద్ధతిలోనే జరిగాయని నివేదిక గుర్తుచేసింది. రాజ్యాంగానికి సవరణలు చేయడం ద్వారా మళ్లీ జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది. అయితే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా లోక్సభ, ఆయా రాష్ట్రాల శాసనసభల గడువులను ఒకదానికొకటి సర్దుబాటు చేయాల్సి ఉన్నదని పేర్కొన్నది.
ఇందుకు పలు రాష్ట్రాల చట్టసభల గడువును పొడిగించడం లేదా తగ్గించడం చేయాల్సి ఉంటుందని, దీనికి రాజకీయ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరమున్నదని తెలిపింది. నిత్యం ఎన్నికలు జరుగుతుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై భారం పడుతున్నదని, అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నదని పేర్కొన్నది. 1983లో ఎన్నికల సంఘం జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిన విషయాన్ని కమిటీ ప్రస్తావించింది.
అనంతరం జస్టిస్ జీవన్రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ కూడా ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపిందని గుర్తుచేసింది. వివిధ అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలు కూడా తమ నివేదికలను సమర్పించాయి. వాటిని ప్రభుత్వం పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టింది.భారత ప్రభుత్వ యంత్రాంగం ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్పైనే అధికంగా ఆధారపడుతున్నదని ఒక పార్లమెంటరీ స్థాయీసంఘం తన నివేదికలో పేర్కొన్నది. దీనిని బట్టి చూస్తుంటే దేశం మొత్తం మీద జమిలి ఎన్నికలు జరగటం ఖాయమని తెలుస్తుంది.
Crystal Shivling : హిందూ సంప్రదాయంలో శివలింగానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. పరమశివుడి నిరాకార స్వరూపానికి ప్రతీకగా భావించే…
Tea : భారతీయుల జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి వేడి…
Chiranjeevi Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా విడుదలైన మొదటి…
Best Smartphones : స్మార్ట్ఫోన్ మార్కెట్లో ప్రతి నెలా కొత్త మోడళ్లు విడుదలవుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఎన్నో ఎంపికలు అందుబాటులోకి…
Mango Farmer : మామిడి పండ్లను పండించే రైతులు మంచి దిగుబడి వస్తే సంతోషిస్తారు. కానీ ఒడిశాకు చెందిన ఓ…
Summer Holidays : రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో…
Peddi Movie Day 1 Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా…
Peddi Movie OTT : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కించిన…
CM Revanth Reddy : ఉప్పల్ Uppal ప్రాంత ప్రజలకు మరో శుభవార్త అందింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)…
Farmers : వ్యవసాయ రంగంలో రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత కీలక పథకాలలో…
Chandrababu Pawan Kalyan : తెలంగాణ Telangana రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేచింది. Andhra pradesh ఆంధ్రప్రదేశ్ ఉప…
Parameshwar Reddy : ఉప్పల్ Uppal ప్రాంతంలోని నాలా అభివృద్ధి పనుల నేపథ్యంలో పలువురు కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్న వేళ,…
This website uses cookies.