Pawan kalyan : టీడీపీ తో అందుకే పొత్తు పెట్టుకున్నా ‘ – జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..!

Pawan kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ సీపీ పార్టీని ఓడించి తాము అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ పార్టీలు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు తెలిసిందే ఇటివల కాకినాడ హార్బర్ లో బోట్లు కాలిపోయాయి. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. కండ బలం, గుండె బలం ఎంత ఉందో ఒక మత్స్యకారుడిని చూసి నేర్చుకోవచ్చు. ఒక మత్స్యకారుడు వేట కోసం వందల కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి ఇంటిని గడపాలి అంటే ఎంత కష్టమైనా పని. పాతిక లక్షలు ఖర్చు పెట్టి బోట్లు కొంటె చివరికి అవి కాలిపోయాయి.

హార్బర్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా చీకటి గ్యాంగ్ నడుస్తుంది. హార్బర్లో కొంతమంది గ్యాంగ్స్ గా ఏర్పడి మత్స్యకారులను బెదిరిస్తున్నారు. ఆడవారి మీద దోపిడీలు చేస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి ఎక్కువైపోయింది. ఆంధ్ర రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. రౌడీ మూకలు రాజ్యాన్ని ఏలేస్తున్నారు. నాలుగు నెలల తరువాత హార్బర్ మంచి స్థాయికి తీసుకొచ్చి హామీ జనసేన తీసుకుంటుంది అని అన్నారు. ఇక జనసేన టిడిపి తో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పారు. వైసీపీతో ఛాన్స్ తీసుకోవడం లేదని, ఎంత బలం ఉన్న కానీ ఒకసారి 500 ఓట్లతో ఓడిపోయాం, 5000 ఓట్లతో ఓడిపోయాం అనె పరిస్థితి రాకూడదని. మెజారిటీతో గెలవాలని,

మళ్లీ వైసీపీ వస్తే చీకటి మూకలు ఉంటాయని, వైసీపీ నాయకులు దండుపాలెం గ్యాంగ్ లాగా తయారయ్యారు అని అన్నారు. కచ్చితంగా ఇక్కడ మెరైన్ పోలీస్ ఏర్పాటు చేయాలని, ప్రతి మహిళ రక్షణ బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని, 2 లక్షల 40 కోట్ల మత్స్య సంపదను మన రాష్ట్రం ఎగుమతి చేస్తుందని, దీని ఆదాయం దాదాపుగా 16 వేల కోట్లు ఉంటుందని, మీరు రాష్ట్రానికి ఇంత ఆదాయం ఇయిస్తున్నారు కానీ ప్రభుత్వ మీకేం చేస్తుంది, ఓట్లు పోతాయని భయంతో హార్బర్లో జరిగిన ప్రమాదానికి పారితోషికం ఇచ్చారు రాష్ట్రంలో మత్స్య సంపద ఇంత ఉన్న మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. రాష్ట్రానికి చాలా ఆదాయం ఇస్తున్న మీరు ఎందుకు అడుక్కోవాలి. మత్స్య కారులకు అండగా, వారి జీవితాలకు వెలుగునిచ్చే బాధ్యత జనసేన పార్టీదే అని ఆయన అన్నారు.

Recent Posts

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

4 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

6 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

8 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

9 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

12 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

15 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

1 day ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

1 day ago