PMAY : దేశంలోని పేద ప్రజలు ఇల్లు కట్టుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకం కింద దాదాపు కోటి ఇల్లను మంజూరు చేసేందుకుగాను ఇటీవల క్యాబినెట్ కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ పథకానికి ఎవరు అర్హులు..?ఈ పథకం ద్వారా ఎలాంటి రాయితీలు లభిస్తాయి..?తదితర వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పట్టణాలలో నివసిస్తున్నటువంటి పేద మరియు మధ్యతరగతి ప్రజలకి కచ్చితంగా సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కల ఉంటుంది. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం సహేతుకమైన ధరలలో ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి మరియు పేద ప్రజల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం దేశంలోని పట్టణాలలో నివసించే పేద మరియు మధ్య తరగతి వారు సొంతంగా ఇల్లు కట్టుకునే విధంగా వారికి గృహ సబ్సిడీ అందించడమే.
మురికివాడలో నివసించే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వితంతువు దివ్యాంగులు మరియు సమాజంలో వెనకబడిన మరియు అట్టడుగు వర్గాలు చెందినవారికి ఈ పథకం మేలును కలుగజేస్తుంది. అదేవిధంగా సఫాయి కార్మికులు, వీధి వ్యాపారులు చేతివృత్తుల వారు అంగన్వాడి వర్కర్స్ వంటి వారికి కూడా ఈ పథకం ప్రయోజనాలు అందిస్తుంది.
ఆర్థిక బలహీన వర్గాలు మరియు అల్పాదాయ వర్గాలు మధ్యస్థాయి ఆదాయ వర్గానికి చెందినవారు ఈ పథకానికిి అర్హులవుతారు. అయితే ఈ పథకంలో ప్రయోజనాలు పొందాలంటే కుటుంబం యొక్క ఆర్థిక ఆదాయం 0 నుండి 3లక్షల మధ్య ఉండాలి. అలాంటివారు ఆర్థిక బలహీన వర్గాలకు చెందిన వారు అవుతారు. అలాగే 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు ఎల్ఐసి క్యాటగిరి కిందకి 6 నుంచి 9 లక్షల వరకు ఉన్నవారిని ఎంఐజి కేటగిరి కింద పరిగణించడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరీకి చెందినవారికి సొంత స్థలం ఉన్నట్లయితే వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తుంది. అలాగే భూమిలేని లబ్ధిదారులకు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట వారికి పట్టా భూమి అందించడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ లేదా ప్రైవేట్ ఏజెన్సీలు నిర్మించిన ఇల్లు కొనుగోలు చేయాలి అనుకునే ఈ డబ్ల్యూ ఎస్ వర్గానికి చెందినవారికి ఆర్దిక చేయూత అందించడంజరుగుతుంది.
అదేవిధంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి మరియు అల్ప మధ్య స్థాయి వర్గాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా హోమ్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ 35 లక్షల వరకు విలువ చేసే ప్రాపర్టీ కోసం మీరు బ్యాంకు నుండి 25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు . బ్యాంకు నుండి తీసుకున్న ఈ రుణాన్ని మీరు 12 ఏళ్లలోపు తీర్చాలి అని నిర్ణయించుకున్నట్లయితే మీ మొత్తం లోన్ అమౌంట్ 8 లక్షల రుణం పై 4% వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది.ఈ లెక్క ప్రకారం 5 సంవత్సరాల లోపు గరిష్టంగా రూ.1.80 లక్షల వరకు మీరు సబ్సిడీ పొందవచ్చు .
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.