Categories: Newspolitics

Prashant Kishore : మ‌రోసారి జ‌గ‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌నున్న ప్ర‌శాంత్ కిషోర్ !

Advertisement
Advertisement

Prashant Kishore : ప్రశాంత్ కిషోర్.. భారతీయ ఎన్నికలలో మిడాస్ టచ్ ఉన్న వ్యక్తి. అతను ప‌ని చేసిన దాదాపు ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వ‌చ్చేలా చేశాడు. వైఎస్‌ఆర్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను 2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడంలో క్రీయాశీల‌క పాత్ర పోషించారు. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను 22 స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు గాను 150 స్థానాలకు పైగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది.అయితే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓట‌మి పాలైంది. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ, ప్రజలతో దూరం పెరగడ‌ జగన్ ఓటమికి ఒక కారణంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్ పార్టీ నేతలతో వ‌రుస‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు. దాంతో ఏపీలో రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారుతున్న‌ది.

Advertisement

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మ‌ళ్లీ వైసీపీకి ప‌నిచేసే అంశం మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చగా మారుతున్న‌ది. 2019 ఎన్నికల ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు, సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఏర్పాటుతో జగన్ కు దూరం జ‌రిగారు. అయితే ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేసిన రిషిరాజ్ సింగ్ వైసీపీ కోసం తాజా ఎన్నికల వరకు తన టీంతో పని చేశారు. మ‌రోవైపు ప్రశాంత్ కిషోర్ ఒక‌ప్ప‌టి సహచరుడు రాబిన్ శర్మ, శంతన్ టీడీపీకి పని చేశారు.

Advertisement

ఇదేక్ర‌మంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ప్రశాంత్ కిషోర్ అమరావతికి వచ్చి సమావేశం అయ్యారు. హైదరాబాద్ కేంద్రంగానూ ఇరువురి మ‌ధ్య భేటీలు జ‌రిగాయి. జగన్ కు వ్యతిరేకంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోతారని చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, మద్యం గురించి కూటమి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే వాదన ఉంది.

Prashant Kishore : మ‌రోసారి జ‌గ‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌నున్న ప్ర‌శాంత్ కిషోర్ !

జగన్ కు సన్నిహితంగా ఉండే ఒక జాతీయ నేత సూచనతో తిరిగి ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ కోసం పని చేయాలని కోరిన‌ట్లుగా స‌మాచారం. అయితే ఈ ప్రతిపాదన జగన్ వద్ద రాగా అందుకు జగన్ సుముఖంగా లేరని పార్టీ నాయ‌కులు పేర్కొంటున్నారు. జగన్ ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ నేరుగా చూస్తున్నారు. దీనిపై వైసీపీ నేత‌లు గానీ లేదా ప్రశాంత్ కిషోర్ గానీ స్పందిస్తే స్పష్టత వ‌చ్చే అవ‌కాశం.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

4 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

5 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

6 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

7 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

8 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

9 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

10 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

11 hours ago

This website uses cookies.