Categories: NewspoliticsTelangana

KTR VS Revanth Reddy : పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియదు.. నువ్వేం ముఖ్యమంత్రివి.. సిగ్గుతో తలదించుకుంటున్నా.. కేటీఆర్ ఫైర్

KTR VS Revanth Reddy : ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి. వాళ్లు ఏదైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని ఉద్దేశంలో మైక్ ఇచ్చాం. మైక్ ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాం. మీరు వాళ్లకు ఇచ్చారు. దాని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగపడేది కానీ.. నేను మాట్లాడిన అంశాలలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ప్రస్తావించి ఉంటే ఖచ్చితంగా వాళ్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్లీ అక్కసు వెళ్లగక్కుతున్నారు. అక్కడేదో మేనేజ్ మెంట్ కోటాలో నేను కూర్చుందామని అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి కూర్చొన్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అనే కుళ్లు కనిపిస్తోంది తప్పితే ఇంకేం లేదు. గత ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకున్నా కొన్ని వాస్తవాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు. నీ ద్వారా వాళ్లు ఆ సమయంలో మరి గుర్తుందో లేదో.. ఇప్పుడు గుర్తు చేయాలని అనుకుంటున్నా. పదో తరగతి ప్రశ్నాపత్రాలు వాట్సప్ లలో తిరుగుతూ.. పదో తరగతి పరీక్షలే నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఆనాడు ఉండేది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

18 జులై 1996, ఒక చర్చ సందర్భంగా ఈ చర్చ 610 జీవో మీద తెలంగాణ సమస్యల మీద జరిగింది. అప్పుడు ఒక గొప్ప నాయకుడు.. చాలా గొప్ప నాయకులం అని చెప్పుకునే వాళ్లు ఏం మాట్లాడారో చెప్పదలుచుకున్నా అధ్యక్షా. ఉద్యోగులకు సంబంధించి ఆరు సూత్రాల పథకం, జోనల్ సిస్టమ్ వంటివి దెబ్బతిన్నాయి. సర్ ప్లస్ స్టాఫ్ ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునే వీలు ఉండాలి. కానీ.. ఆ విధానం లేదు. మనం విధించుకున్న ఆటంకం ఆరు సూత్రాల జోనల్ విధానం. సిబ్బందిని వినియోగించుకోలేక, పని లేకపోయినా కోట్ల లక్షల రూపాయలు నిరార్ధకంగా పెట్టుకొని ఖర్చు చేస్తూ వృథా చేస్తున్నాం. ఈ విధానంలో మార్పులు చేయాలి. డైనమిక్ గా మూవ్ కావాలి. ఆయా ప్రాంతాల ప్రజల ప్రజా ప్రతినిధులతోనో, ఉద్యోగ సంఘాలతోనో సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి.. అని ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులై కేంద్ర ప్రభుత్వంతోటి కొట్లాడి నిటారుగా నిలబడి సాధించుకున్న జోనల్ విధానాన్ని జోనల్ విధానం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తెలంగాణ వాటాను, కోటాను నిర్ణయించి, నిర్ణయం చేసి జోనల్ విధానం తీసుకొస్తే ఈ 18 జులై 1996 నాడు మంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగంలోకి పాఠం ఇది అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

KTR VS Revanth Reddy : పీసీసీ అధ్యక్షుడిలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు

స్పీకర్ సార్.. నేను నిజంగానే సిగ్గు పడుతున్నా సార్. పంటల భీమాకు రైతు భీమాకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గు పడుతున్నా. పంట బీమాకు, రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి. వారు పర్సనల్ గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఏదో పీసీసీ అధ్యక్ష పదవిలో గాంధీ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్స్ చేస్తున్నారు. ఆయన గౌరవమైన పదవిలో ఉన్నారు. నేను ఏమంటానంటే.. నేరెళ్లలో ఏదో జరిగింది. సాండ్ మాఫియా అంటున్నారు. 2004 నుంచి 2014 వరకు సాండ్ మీద ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం 39.5 కోట్లు. అంతే సంవత్సరానికి 4 కోట్ల ఆదాయం కూడా రాలేదు. అదే 2014 నుంచి 2023 వరకు అధ్యక్షా.. ఈ రాష్ట్రానికి ఇసుక మీద వచ్చిన ఆదాయం 5000 కోట్ల పైచిలుకు అధ్యక్షా. 4 కోట్లు కూడా ఆదాయం లేని నాడు సాండ్ మాఫియా ఎవరిది కాంగ్రెస్ పార్టీదా.. కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నిండినయా? ఎవరి జేబులు నిండాయి. నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు.. ఎక్కిచ్చారు అంటున్నారు. పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు. 2018 కి ముందు చెప్పారు. తర్వాత చెప్పారు. ఆయన చెప్పిన నేరెళ్లలో కూడా మా పార్టీ అభ్యర్థికి మరొకసారి గెలిపించారు అని కేటీఆర్.. రేవంత్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

Recent Posts

Xiaomi 17 Pro Max vs iPhone 17 Pro Max | iPhone 17 Pro Maxకి గట్టిపోటీగా Xiaomi 17 Pro Max లాంచ్.. ధరలో అరవై శాతం తక్కువ

Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…

4 hours ago

Bonus | సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త .. దీపావళి బోనస్ కూడా ప్రకటించిన కేంద్రం

Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…

6 hours ago

Vijaywada | 5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు

Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…

9 hours ago

AP Free Bus Scheme | ఏసీ బ‌స్సుల్లోను ఫ్రీగా ప్ర‌యాణించే ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన ఆర్టీసీ ఎండీ

AP Free Bus Scheme |  ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…

10 hours ago

Telangana IPS Transfers | తెలంగాణలో భారీ ఐపీఎస్ బదిలీలు .. ప్రభుత్వ పరిపాలనలో కొత్త అడుగులు…

Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…

12 hours ago

Allu Family | అల్లు వారింట పెళ్లి సంద‌డి.. శిరీష్ పెళ్లి చేసుకోబోయే యువ‌తి ఎవ‌రంటే..!

Allu Family | మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…

13 hours ago

Eye Care Tips | స్వీట్స్ ఎక్కువ తింటున్నారా.. కంటి చూపు పోయే ప్రమాదం..!

Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…

14 hours ago

Ramen noodles | రామెన్ నూడుల్స్ అధిక వినియోగం..మరణ ప్రమాదం 1.5 రెట్లు పెరుగుదల

Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…

15 hours ago