Revanth Reddy : మీడియాను పండబెట్టి తొక్కుతా… రేవంత్ రెడ్డి వార్నింగ్.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : మీడియాను పండబెట్టి తొక్కుతా… రేవంత్ రెడ్డి వార్నింగ్.. వీడియో వైరల్

Revanth Reddy : మీడియాను పండబెట్టి తొక్కుతా అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిజానికి రేవంత్ రెడ్డికి కోపం వస్తే బూతులు మాట్లాడుతారు. అది అందరికీ తెలుసు. కోపంలో ఆయన ఏం మాట్లాడుతారో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలపై ఆయన కూడా ఎక్కువగా స్పందించరు. డబ్బులకు అమ్ముడుపోయాడని, ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు.. రేటెంత రెడ్డి అని.. తెలంగాణలో కాంగ్రెస్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :8 November 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  మీడియాపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి

  •  రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

  •  మీడియాను ఎందుకు రేవంత్ టార్గెట్ చేశారు?

Revanth Reddy : మీడియాను పండబెట్టి తొక్కుతా అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిజానికి రేవంత్ రెడ్డికి కోపం వస్తే బూతులు మాట్లాడుతారు. అది అందరికీ తెలుసు. కోపంలో ఆయన ఏం మాట్లాడుతారో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలపై ఆయన కూడా ఎక్కువగా స్పందించరు. డబ్బులకు అమ్ముడుపోయాడని, ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు.. రేటెంత రెడ్డి అని.. తెలంగాణలో కాంగ్రెస్ సీట్లు మొత్తం అమ్ముకున్నాడని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అసలు రేవంత్ రెడ్డి ఒక్కో టికెట్ ను పది కోట్లకు అమ్ముకున్నాడు అని కూడా కాంగ్రెస్ నాయకులే ఆరోపణలు చేశారు. చివరకు కొందరు నాయకులకు రేవంత్ తో పడక.. పార్టీనే వదిలేసి వేరే పార్టీలో చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచే పార్టీనే నమ్ముకొని ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు అయితే రేవంత్  పోరు పడలేక పార్టీని వదిలేసి వెళ్లిపోయారు.

ఇక.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును పెంచింది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి తాజాగా ఓ చోట మాట్లాడుతూ మీడియాపై రెచ్చిపోయారు. మామూలుగా కాదు.. బూతులు మాట్లాడుతూ మీడియాను తిట్టేశారు. లోఫర్ నా కొడుకులు.. కొన్ని చానెళ్లు ఉన్నాయి.. వాళ్ల చేతుల్లో ఉంది కదా అని అడ్డగోలుగా వేస్తే చూస్తూ ఊరుకుంటామా? బండకేసి తొక్కి పేగులు తీస్తా బిడ్డ.. గాడిదా నా కొడుకులను ఒక్కొక్కరిని. మీకు ఎవ్వరు కనిపిస్తే వారి దగ్గరికి వెళ్లి మైక్ తీసుకొని వాళ్ల మూతుల్లో పెడితే.. వాళ్లు కూతలు కూస్తే వాటిని వివరించే ఓపిక, తీరిక నాకు లేదు. అట్లాంటి లఫూట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పలేను. వాళ్ల దగ్గర ఏముంటే అది అన్నీ చూపించుకోమని చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు అంటూ రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు.

Revanth Reddy : రేవంత్ రెడ్డి ఎందుకు అంతలా ఫైర్ అవుతున్నాడు?

రేవంత్ రెడ్డి అంతలా ఫైర్ అవడానికి కారణం ఉందని కాంగ్రెస్ అభిమానులు అంటున్నారు. బీఆర్ఎస్ అనుకూల మీడియా కావాలని కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డిపై బురద జల్లుతోందని.. అందుకే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల సమీపిస్తున్న వేళ రేవంత్ కొంచెమైనా నోరు అదుపులో పెట్టుకోవాలి కానీ.. ఇలా మాట్లాడితే పార్టీకే నష్టం అంటూ నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది