YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?
ప్రధానాంశాలు:
YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?
జగన్ వెంట పాలకొండ్రాయుడు..? నిజమేనా..?
కడప లో కూటమికి బిగ్ షాక్ తగలబోతుందా.?
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న వేళ, రాజకీయ రంగంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పార్టీ మార్పుల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లైన కడపలో టీడీపీకి సుదీర్ఘకాలంగా బలంగా నిలిచిన సుగవాసి కుటుంబం ఇప్పుడు వైసీపీ కండువా కప్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు జోరుగా నడుస్తున్నాయి.

YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?
YSRCP TDP : కూటమికి ఏడాది పూర్తి..వైసీపీ లో వలసల పర్వం మొదలు..?
సుగవాసి పాలకొండ్రాయుడు 1978లో జనతా పార్టీ తరఫున రాయచోటిలో ఎమ్మెల్యేగా గెలవగా, అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా కూడా విజయం సాధించారు. 1984లో టీడీపీలో చేరిన తరువాత రాయలసీమ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. రాజంపేట ఎంపీగా, రాయచోటి ఎమ్మెల్యేగా అనేక విజయాలు సాధించారు. వారసుడిగా మిగిలిన బాలసుబ్రమణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తరువాత పార్టీకి దూరమయ్యారు. ఇక ఇప్పుడు పార్టీ పై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన వైసీపీ నేతలతో సంప్రదింపుల అనంతరం రాజీనామా చేసినట్టు ప్రచారం సాగుతోంది.
బలిజ సామాజిక వర్గంలో తనదైన ప్రాధాన్యం ఉన్న సుగవాసి కుటుంబాన్ని పార్టీలోకి తీసుకోవడం ద్వారా, రాయలసీమలో సామాజిక సమీకరణాలను బలోపేతం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. బాలసుబ్రమణ్యంకు రాజంపేట ఎంపీ టికెట్ హామీ ఇచ్చినట్లు సమాచారం, ఇక మిథున్ రెడ్డి పీలేరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం. అయితే ఈ తరుణంలో జనసేన కూడా సుగవాసిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. కానీ సుగవాసి మద్దతుదారులు మాత్రం కూటమిలో ఇతర పార్టీలలో చేరే ఆస్కారమే లేదని స్పష్టం చేస్తున్నారు. వచ్చే వారం జగన్తో భేటీ అనంతరం అధికారికంగా వైసీపీలో చేరిక ఖరారవుతుందని భావిస్తున్నారు. మరి పాలకొండ్రాయుడు ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.