Tdp : ఆ నియోజికవర్గం లో రెండు వర్గాలు గా చీలిపోయిన టీడీపీ !

Tdp : ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో చతికిలబడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విభజన జరిగినా అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికలలో టీడీపీ అధికారం కైవసం చేసుకుంది. కానీ 2019 ఎన్నికలలో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మరోపక్క చంద్రబాబు వయసు మీద పడుతూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో అన్న వైసీపీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ మరోసారి అధికారం దిశగా అడుగులు వెయ్యబోతున్నట్లు అనేక సర్వేలలో ఫలితాలు వస్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీడీపీ కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పైగా చంద్రబాబుకి వయసు మీద పడటంతో పాటు మరోపక్క తెలుగుదేశం పార్టీలో చెప్పుకోదగ్గ బలమైన నాయకుడు లేకపోవడంతో.

ఈసారి ఓడిపోతే టీడీపీ దుకాణం సర్దుకోవడమే అనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ఈసారి ఎన్నికలలో గెలిస్తే 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకో అక్కరలేదని నేతలకు చెబుతున్నారు. పరిస్తితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలలో సైతం ఆత్మస్థైర్యం తగ్గిపోతున్నట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది. విషయంలోకి వెళ్తే చాలా నియోజకవర్గాలలో అంతర్గత కొమ్ములాటలు ఉండటంతో.. గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఈ పరిణామాలతో ఎవరికివారు రెండు వర్గాలుగా చీలిపోతూ ఉన్నారు. తాజాగా రాజానగరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఏర్పడినట్లు టాక్. విషయంలోకి వెళ్తే అక్కడ ఎప్పటి నుండో వెంకటేష్ టిడిపి ఇన్చార్జిగా ఉంటున్నారు. అయితే వెంకటేష్ ఇన్చార్జిగా.

TDP

సరిగా వ్యహరించడం లేదని..పార్టీ బలహీన పడిందని ప్రచారం ఉంది. ఫలితంగా కొత్త ఇంచార్జ్ నీ నియమించాలని టిడిపి శ్రేణులు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. 2014లో వెంకటేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ తరఫున 2014లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన వెంకటరమణ చౌదరి అనే నేత సినీ నటుడు … మురళీమోహన్ చేతిలో ఓటమి చెందారు. ఆ ఎన్నికలలో రెండో స్థానానికి పరిమితం అయ్యారు. కాగా గత ఏడాది మే నెలలో వెంకటరమణ చౌదరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఇటీవల వెంకటరమణనీ రాజానగరం ఇన్చార్జి గా చంద్రబాబు నియమించడం జరిగింది.

ఈ నియామకంతో పెందుర్తి వెంకటేష్ వర్గం.. అలగడం జరిగిందట. మరోపక్క ఎవరు ఇన్చార్జ్ అయితే వారే ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రచారం జరుగుతుంది. అయితే రాజానగరం నియోజకవర్గానికి ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీ తరఫున సేవలందిస్తున్న వెంకటేష్ తాజా.. వెంకటరమణ చౌదరిని ఇన్చార్జిగా నియమించడం పట్ల అసహనంగా ఉన్నట్లు టాక్. ఈ పరిణామంతో రాజానగరంలో రెండు వర్గాలుగా టిడిపి విడిపోయినట్లు జిల్లా రాజకీయాలలో ప్రచారం జరుగుతోంది.

Recent Posts

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

4 hours ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

5 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

6 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

7 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

8 hours ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

9 hours ago

Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు

Group 1 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…

10 hours ago

Rains | బంగాళాఖాతంలో మ‌రో అల్పపీడనం ప్రభావం.. రానున్న రోజుల‌లో భారీ వ‌ర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…

11 hours ago