Medigadda Review : తెలంగాణ మంత్రుల బృందం ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్ట్ ను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి బుంగలు పడ్డ చోటును మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష కోట్లతో లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.ప్రాణహిత పూర్తయితే అందరికీ నీళ్లు వచ్చేవన్నారు.
వెయ్యి కోట్ల మోటార్లకు రూ.4 వేల కోట్ల బిల్లులు వేశారన్నారు. పల్లానికి వచ్చే నీళ్లను ఆ తుగ్లక్ రాకుండా చేశాడు. సర్కార్ కు ఇరిగేషన్ పెండింగ్ బిల్లులు దాదాపు 9 వేల కోట్లు ఉన్నాయన్నారు. కుట్ర కోణం అనేదే విచిత్రంగా ఉందన్నారు. ప్రాజెక్టులో ఉన్న లోపాలన్నీ మానవ తప్పిదాలే. లోపాలపై నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. మేడిగడ్డ సందర్శనపై సీఎం రేవంత్ రెడ్డికి రెండు మూడు రోజుల్లో నివేదిక అందిస్తాం. ఇలాంటి నాసిరకం నిర్మాణాన్ని ఎక్కడా చూడలేదు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అనేది త్వరలోనే ప్రకటిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం అయినప్పటి నుంచే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి.
పక్కా ప్లాన్ తో ప్రాజెక్ట్ లొకేషన్ ను కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చింది. 5 ఫీట్లు లోతుకు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి.. ఇది అద్భుతమైన ప్రాజెక్టా… మరి అది కుంగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. లక్ష కోట్లు పెట్టి మూడు బ్యారేజీలు కట్టారు.. ఆ బ్యారేజీలే ఇప్పుడు డ్యామేజ్ అయ్యాయని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు.కాళేశ్వరం ప్రాజెక్టు ను మొదటి నుంచి వ్యతిరేకించా. కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా లోపాలు ఉన్నాయి. బ్యాక్ వాటర్ పై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. నాలుగేళ్లుగా ముంపుతో రైతులు నష్టపోతున్నారు. సీఎంతో మాట్లాడి త్వరగా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్. 2 టీఎంసీల పనే పూర్తి కాలేదు.. మూడో టీఎంసీకి ఖర్చు పెట్టారు. బ్యాక్ వాటర్ పై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అన్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.