Today Telugu Breaking News : ఇందిరా పార్కు వద్ద కర్ణాటక రైతుల ధర్నా.. 5 నిమిషాల్లో మాట మార్చిన రేవంత్ రెడ్డి.. బీజేపీ గుట్టు బయటపెట్టిన హరీశ్ రావు.. స్కూల్ పిల్లల ఆటోలను ఢీకొట్టిన లారీ

Advertisement
Advertisement

Today Telugu Breaking News : ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్న కర్ణాటక రైతులపై(Karnataka Farmers) కాంగ్రెస్ నేతలు(Congress Leaders) దాడికి దిగారు. మీరు ఇక్కడ ఎలా ధర్నా చేస్తారు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బూతులు తిట్టారు. ధర్నా చేస్తే మీ సంగతి చెప్తాం అంటూ నానా యాగీ చేశారు. కర్ణాటక రైతులను ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు బెదిరించారు.

Advertisement

5 నిమిషాల్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy0 మాట మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడారు అని చెప్పిన రేవంత్ రెడ్డి వెంటనే మాట మార్చి.. తెలంగాణ ఆకాంక్షలు నీళ్లు, నిధులు, నియామకాలు కాదంటూ మాట మార్చారు.

Advertisement

బీజేపీ(BJP) మాత్రమే కాదు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ మోటార్లకు మీటర్లు పెడుతూ అదనంగా అప్పు తీసుకున్నారని మంత్రి హరీశ్ రావు(Harish Rao) స్పష్టం చేశారు. పూర్తి ఆధారాలతో హరీశ్ రావు బయటపెట్టారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ సహా 12 రాష్ట్రాలు కేంద్రం చెప్పినట్టుగా మోటార్లకు మీటర్లు పెట్టాయని… ఆయా రాష్ట్రాలు రూ.66,413 కోట్లు అదనంగా అప్పు తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇస్తూ 28 జూన్ 2023న కేంద్ర ప్రకటన విడుదల చేసిందని.. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం కూడా మోటార్లకు మీటర్లు పెట్టి అప్పు తీసుకుంటాం అని కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ లో తెలిపారని అన్నారు.

వైజాగ్(Vizag) లోని సంఘం శరత్ థియేటర్(Sharath Theatre) సమీపంలో స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఎనిమిది మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ముస్లిం నమాజ్ టోపీ విసిరికొట్టిన రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి కాంగ్రెస్ సభలో ముస్లిం పెద్దలు నమాజ్ టోపీ పెడుతుండగా చీదరించుకుంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) విసిరికొట్టారు.

నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case)లో ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సోనియా, రాహుల్ గాంధీ(Sonia Gandhi, Rahul Gandhi)లకు సంబంధించి ఢిల్లీ, ముంబై, లక్నోలో రూ.752 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ప్రముఖ సినీ నటి, టీడీపీ నేత దివ్యవాణి(Divya vani).. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే.. దివ్యవాణికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణ కోసం బిడ్డలు చనిపోతుంటే సోనియా గాంధీ(Sonia  Gandhi) బిచ్చం వేసిందని.. కాంగ్రెస్ నాయకురాలు, అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి(Atchampet Congress Candidate) భార్య అనురాధ అన్నారు.

తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టలేదు.. అందుకే నిధులు ఇవ్వలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) అన్నారు.

తెలంగాణ(Telangana Assembly Elections 2023) ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీలకు చెందిన 360 మంది అభ్యర్థుల్లో 226 మందికి నేర చరిత్ర ఉందని ఎన్నికల కమిషన్ తెలిపింది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

8 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

9 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

10 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

11 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

12 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

13 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

14 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

15 hours ago

This website uses cookies.