
Today Telugu Breaking News 27-11-2023
Today Telugu Breaking News : రైతుబంధు(Rythu Bandhu Scheme) పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వచ్చిన ఫిర్యాదులతో అనుమతి ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ తెలిపింది. నిధులు విడుదల చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 28 లోపు రైతు బంధు పంపిణీ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం 2 రోజుల క్రితమే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈవారం ఓటీటీలో(OTT Release movies this week) వచ్చే సినిమాల లిస్టు ఇదే. డిస్నీ హాట్ స్టార్ లో చిన్నా నవంబర్ 28న, ఇండియానా జోన్స్ ది డయల్ ఆఫ్ డెస్టినీ డిసెంబర్ 1న, సోనీలివ్ లో మార్టిన్ లూథర్ కింగ్ నవంబర్ 29న, జియోలో 800 డిసెంబర్ 2న, అమెజాన్ ప్రైమ్ లో దూత డిసెంబర్ 1న వెబ్ సిరీస్, నెట్ ఫ్లిక్స్ బుజ్జిగాడు, ఖుషీ, ఈరోజుల్లో, బంగారు బుల్లోడు, ఐతే నవంబర్ 30న, మిషన్ రాణిగంజ్ డిసెంబర్ 1న రిలీజ్ కానున్నాయి.
కాంగ్రెస్ నేతలే రైతు బంధు సాయం(Rythu Bandhu scheme) పంపిణీకి అనుమతిని ఈసీ ఉపసంహరించుకోవాలని వెంట పడి మరీ ఆపించారని కవిత(Kalvakuntla Kavitha) ఆరోపించారు. వారి ఫిర్యాదుతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని.. రైతు వ్యతిరేకతను కాంగ్రెస్ నేతలు మరోసారి చాటుకున్నారని.. ముందు అనుమతి ఇచ్చిన ఈసీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే బ్రేక్ వేసిందన్నారు.
ఎన్నికల ప్రచారం రేపు ముగుస్తుండటంతో బీజేపీ భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వీర్ సావర్కర్ విగ్రహం వరకు ప్రధాని మోదీ రోడ్(PM Modi Road Show) షో జరగనుంది. కాషాయ శ్రేణులు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో మోదీ పాల్గొంటారు.
రైతుబంధుకు ఈసీ బ్రేక్ వేయడంపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, అహంకారం తప్పితే రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం కేసీఆర్, హరీశ్ రావు(Harish Rao)కు లేదన్నారు. హరీశ్ చేసిన వ్యాఖ్యల వల్లనే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంటున్నట్టు ఆదేశాలు ఇచ్చిందని.. రైతులు ఆందోళన చెందవద్దని.. పది రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.15 వేలు రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తామన్నారు.
మీరు చాయ్ తాగే లోపు ఫోన్లు టింగ్ టింగ్ మని మోగుతాయని రైతుబంధును ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు(Minister harish Rao) చేసిన వ్యాఖ్యల వల్లనే రైతుబంధు నిర్ణయాన్ని ఈసీ ఉపసంహరించుకుందని తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం సాగుతోంది.
టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) యువగళం(Yuvagalam) పాదయాత్ర ఈరోజు నుంచి పున:ప్రారంభం కానుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి ప్రారంభం కానుంది.
ఈరోజు కార్తీక పౌర్ణమి(Karthika Pournami) సందర్భంగా ఉదయం నుంచే నదులు, సముద్రాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. భద్రాచలం, శ్రీశైలంలో నది స్నానాలకు భారీగా తరలివచ్చారు. ఏపీలోనూ సముద్ర తీర ప్రాంత ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
This website uses cookies.